దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరగుతున్నాయి. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కారణంగా పెను ముఫ్పు ముంచుకోస్తోంది. ఇక ఈ విశృంఖల వ్యాప్తి సంక్రాంతి నాటికి మూడవ దశకు కారణం అవుతుందని ఇప్పటికే వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో దేశంలోని ప్రతీ ఒక్కరినీ ఈ వేరియంట్ ప్రభావితం చేస్తుందని కూడా వైద్యనిపుణులు అంచనాలు వేస్తున్నారు. ఈ క్రమంలో యూనైటెడ్ కింగ్ డమ్ కి చెందిన భారత సంతతికి శాస్త్రవేత్త రవీంద్ర గుప్తా మాత్రం.. ఒమిక్రాన్ వేరియంట్ పరిణామక్రమంలో తప్పిందం వల్ల ఉత్భవించిందని.. సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఒమిక్రాన్ వేరియంట్ ప్రభలడం ద్వారా లక్షణాల తీవ్రత డెల్టాతో పోల్చితే తక్కువగా ఉన్నాయన్న వార్తలు వెలువడిన నేపథ్యంలో ఇది కరోనా రూపాంతరం చెందే పరిణామక్రమంలో జరిగిన తప్పిదం వల్లే ‘తేలికపాటి వైరస్’గా ఉందని రవీంద్ర గుప్తా తెలిపారు. అయితే ఈ వేరియంట్ తరువాత రూపాంతరం చెందే మరిన్ని వేరియంట్లు మానవాళి మనుగడకు ప్రమాదకారిగా తయారుకావచ్చునన్న సంకేతాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. యూనైటెడ్ కింగ్ డమ్ లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన ఒమిక్రాన్పై ఇటీవల పరిశోధన చేశారు.
శరీర రోగ నిరోధక వ్యవస్థకు ఈ రకం వైరస్ మరింత స్పష్టంగా కనిపించేందుకు కారణమవుతున్న కీలక యంత్రాంగాన్ని గుర్తించారు. ఊపిరితిత్తుల్లోని కణాల్లో ఒమిక్రాన్ తక్కువగా ఇన్ఫెక్షన్ కలిగిస్తున్నట్లు గుప్తా గమనించారు. అయితే కరోనా మహమ్మారి ఇప్పటికిప్పుడు తక్కువ ప్రమాదకరంగా రూపాంతరం చెందడానికి ఎలాంటి కారణం కనిపించడం లేదని అందుకు ఇది వేంగా వ్యాప్తి చేందడమే నిదర్శనమని చెప్పారు. అయినా ప్రస్తుతం అది ఈ విధంగా మారడానికి కారణం.. పరిణామక్రమంపరంగా జరిగిన తప్పిదమనే ఆయన అంచనా వేశారు. ఇక భవిష్యత్తులో మునుపటి వేరియంట్లు తరహాలోనే కొత్త వేరియంట్లు తీవ్ర లక్షణాలతో చెలరేగే అవకాశాలు వుండవచ్చునని గుప్తా పేర్కోన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more