Omicron isn’t mild; it’s hospitalising and killing people, warns WHO director

Omicron isn t mild it s hospitalising and killing people warns who director

Dr Tedros Adhanomfour, concern, new variant, Omicron Variant, preading vigourously, delta variant, corona vaccine, omicron, WHO, Omicron, WHO report on Omicron, WHO latest report on Omicron, Covid, Covid Omicron, WHO latest report, omicron latest news, omicron updates

The World Health Organization’s (WHO) Director-General, Tedros Adhanom Ghebreyesus, said in a press conference that the Omicron variant of the coronavirus should not be dismissed as “mild” and that it is killing people around the world. Tedros added that while Omicron is less severe than the Delta variant on fully vaccinated people, the surge in infections is putting pressure on the healthcare worldwide.

ఒమిక్రాన్ వేరియంట్ కూడా ప్రాణాంతకమే: ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక

Posted: 01/07/2022 04:28 PM IST
Omicron isn t mild it s hospitalising and killing people warns who director

ఒమిక్రాన్‌ వేరియంట్ వ్యాప్తిని అనేక దేశాలు సాధారణంగా తీసుకుంటున్నాయని, అయితే ఇది తేలిగ్గా తీసుకోవాల్సిన వేరియంట్ కాదని, ప్రాణాంతక వేరియంట్ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా స్పష్టం చేసింది. ఇప్పటికే ఇది సాదారణ జలుబు లాంటి వ్యాధి కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్ టెక్నికల్ లీడ్ మారియా హెచ్చరించిన తరువాత ఇక తాజాగా డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధ‌న‌మ్ ఘెబ్రియేస‌స్ కూడా ఇది ప్రాణాంతక వేరియంట్ గా పేర్కోన్నారు. ప్రపంచవ్యాప్తంగా గత వారం రోజులుగా భారీ సంఖ్యలో కేసులు నమోదయ్యాయని తెలిపారు. డెల్టాతో పోల్చిచే దీని తీవ్రత తక్కువగా నమోదైనంత మాత్రాన తేలిగ్గా తీసుకుని, తక్కువగా అంచనా వేయరాదని ఆయన హెచ్చరించారు.

డెల్టా తరహాలో.. అంతకుముందు వచ్చిన వేరియంట్ల తరహాలో ఒమిక్రాన్ కూడా ప్రజలను అసుపత్రుల్లో చేరేలా చేస్తోందని, ప్రాణానలు కూడా తీస్తోదని ఆయన అన్ని దేశాలకు హెచ్చరికలు జారీచేశారు. ఒమిక్రాన్ తో కేసులు వేగంగా, విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులు ఒమిక్రాన్ పేషెంట్లతో నిండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వారికి చికిత్సనందించేందుకు సరిపడా సిబ్బంది కూడా లేరని చెప్పారు. దీని వల్ల కొవిడ్ తోనే కాకుండా.. సమయానికి సరైన చికిత్స అందక ఇతర జబ్బులతో బాధపడేవారు కూడా చనిపోయే ప్రమాదముందని హెచ్చరించారు.

తొలి తరం కరోనా వ్యాక్సిన్లు.. కొత్త వేరియంట్లను ఆపలేకపోయినా ప్రభావవంతంగానే పనిచేస్తాయని, కనీసం ఆసుపత్రుల్లో చేరాల్సిన ముప్పును, మరణాల ముప్పును తగ్గిస్తాయని టెడ్రోస్ చెప్పారు. ఈ ఏడాది ప్రథమార్ధం నాటికి అన్ని దేశాల్లో 70 శాతం మేర వ్యాక్సినేషన్ పూర్తయితే మహమ్మారిని కట్టడి చేయవచ్చని పేర్కొన్నారు. ఇప్పుడు జరుగుతున్న వ్యాక్సినేషన్ తో 109 దేశాలు ఆ టార్గెట్ ను అందుకోలేవని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దానికి కారణం వ్యాక్సిన్ అసమానతలేనన్నారు. టెస్ట్ కిట్లు, పీపీఈ కిట్ల దగ్గర్నుంచి వ్యాక్సిన్ల దాకా పేద దేశాలకు అన్యాయమే జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద దేశాలే వాటన్నింటినీ స్టాక్ పైల్ చేసి పెట్టుకుంటున్నాయన్నారు.

కరోనా మహమ్మారిని అంతం చేయడంలో గత ఏడాది అతి పెద్ద వైఫల్యం అదేనన్నారు. ఈ వ్యాక్సిన్ అసమానతలే ప్రజలను, ఉపాధిని చంపేస్తున్నాయన్నారు. దాని వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థలూ కోలుకోవడం కష్టమన్నారు. ప్రస్తుతం కొన్ని దేశాలు నాలుగో డోస్ కూడా వేసేందుకు సిద్ధమవుతున్నాయని, కానీ, చాలా పేద దేశాల్లో కనీసం వైద్య సిబ్బందికీ వేసేందుకు సరిపడా వ్యాక్సిన్లు లేవని అన్నారు. కొన్ని దేశాల్లో బూస్టర్ డోసులు వేసినంత మాత్రాన మహమ్మారి నియంత్రణలోకి రాదని తేల్చి చెప్పారు. కాబట్టి ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న టీకాలను అన్ని దేశాలకూ సమానంగా పంచాలని ఆయన సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles