ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిని అనేక దేశాలు సాధారణంగా తీసుకుంటున్నాయని, అయితే ఇది తేలిగ్గా తీసుకోవాల్సిన వేరియంట్ కాదని, ప్రాణాంతక వేరియంట్ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా స్పష్టం చేసింది. ఇప్పటికే ఇది సాదారణ జలుబు లాంటి వ్యాధి కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్ టెక్నికల్ లీడ్ మారియా హెచ్చరించిన తరువాత ఇక తాజాగా డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనమ్ ఘెబ్రియేసస్ కూడా ఇది ప్రాణాంతక వేరియంట్ గా పేర్కోన్నారు. ప్రపంచవ్యాప్తంగా గత వారం రోజులుగా భారీ సంఖ్యలో కేసులు నమోదయ్యాయని తెలిపారు. డెల్టాతో పోల్చిచే దీని తీవ్రత తక్కువగా నమోదైనంత మాత్రాన తేలిగ్గా తీసుకుని, తక్కువగా అంచనా వేయరాదని ఆయన హెచ్చరించారు.
డెల్టా తరహాలో.. అంతకుముందు వచ్చిన వేరియంట్ల తరహాలో ఒమిక్రాన్ కూడా ప్రజలను అసుపత్రుల్లో చేరేలా చేస్తోందని, ప్రాణానలు కూడా తీస్తోదని ఆయన అన్ని దేశాలకు హెచ్చరికలు జారీచేశారు. ఒమిక్రాన్ తో కేసులు వేగంగా, విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులు ఒమిక్రాన్ పేషెంట్లతో నిండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వారికి చికిత్సనందించేందుకు సరిపడా సిబ్బంది కూడా లేరని చెప్పారు. దీని వల్ల కొవిడ్ తోనే కాకుండా.. సమయానికి సరైన చికిత్స అందక ఇతర జబ్బులతో బాధపడేవారు కూడా చనిపోయే ప్రమాదముందని హెచ్చరించారు.
తొలి తరం కరోనా వ్యాక్సిన్లు.. కొత్త వేరియంట్లను ఆపలేకపోయినా ప్రభావవంతంగానే పనిచేస్తాయని, కనీసం ఆసుపత్రుల్లో చేరాల్సిన ముప్పును, మరణాల ముప్పును తగ్గిస్తాయని టెడ్రోస్ చెప్పారు. ఈ ఏడాది ప్రథమార్ధం నాటికి అన్ని దేశాల్లో 70 శాతం మేర వ్యాక్సినేషన్ పూర్తయితే మహమ్మారిని కట్టడి చేయవచ్చని పేర్కొన్నారు. ఇప్పుడు జరుగుతున్న వ్యాక్సినేషన్ తో 109 దేశాలు ఆ టార్గెట్ ను అందుకోలేవని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దానికి కారణం వ్యాక్సిన్ అసమానతలేనన్నారు. టెస్ట్ కిట్లు, పీపీఈ కిట్ల దగ్గర్నుంచి వ్యాక్సిన్ల దాకా పేద దేశాలకు అన్యాయమే జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద దేశాలే వాటన్నింటినీ స్టాక్ పైల్ చేసి పెట్టుకుంటున్నాయన్నారు.
కరోనా మహమ్మారిని అంతం చేయడంలో గత ఏడాది అతి పెద్ద వైఫల్యం అదేనన్నారు. ఈ వ్యాక్సిన్ అసమానతలే ప్రజలను, ఉపాధిని చంపేస్తున్నాయన్నారు. దాని వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థలూ కోలుకోవడం కష్టమన్నారు. ప్రస్తుతం కొన్ని దేశాలు నాలుగో డోస్ కూడా వేసేందుకు సిద్ధమవుతున్నాయని, కానీ, చాలా పేద దేశాల్లో కనీసం వైద్య సిబ్బందికీ వేసేందుకు సరిపడా వ్యాక్సిన్లు లేవని అన్నారు. కొన్ని దేశాల్లో బూస్టర్ డోసులు వేసినంత మాత్రాన మహమ్మారి నియంత్రణలోకి రాదని తేల్చి చెప్పారు. కాబట్టి ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న టీకాలను అన్ని దేశాలకూ సమానంగా పంచాలని ఆయన సూచించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more