‘No security lapse’, says Channi After PM Stuck On Flyover పంజాబ్ పర్యటనలో ప్రధాని నరేంద్రమోడీకి రైతుల సెగ..

Mha takes cognisance of security breach during pm s visit seeks report from punjab govt

modi punjab rally, modi ferozepur, modi, pm modi, assembly elections 2022, assembly elections latest news, assembly elections covid19 guidelines, Punjab assembly elections, Punjab elections, BJP, PM Modi, Congress, Priyanka Gandhi, Rahul Gandhi, election commission, election press conference, election 2022, state assembly election 2022, assembly election 2022 dates, punjab election 2022, punjab assembly election 2022 dates, punjab election 2022 schedule, punjab state assembly election 2022 dates, punjab assembly election 2022 schedule, election 2022 news

After PM Modi skipped the rally in Punjab, CM Charanjit Singh Channi told a news channel, “There was no security lapse. PM’s road plans were made at the last minute. He was supposed to go by helicopter. I was up late at night overseeing security arrangements for his rally. 70,000 chairs were put up for rally but only 700 people turned up.”

పంజాబ్ పర్యటనలో ప్రధాని నరేంద్రమోడీకి రైతుల సెగ..

Posted: 01/05/2022 05:52 PM IST
Mha takes cognisance of security breach during pm s visit seeks report from punjab govt

భారత ప్రధాని మోదీకి కనీవినీ ఎరుగని భద్రత ఉంటుంది. ఆయన ఎక్కడ పర్యటనకు వెళ్లినా వేలాది మంది సాయుధబలగాలు ఆయనకు భద్రత కల్పిస్తుంటాయి. అయితే ఈరోజు ఆయన పంజాబ్ పర్యటనలో తీవ్ర భద్రతా వైఫల్యం కనిపించింది. ఆయన ప్రయాణిస్తున్న సమయంలో నిరసనకారులు రోడ్డును నిర్బంధించారు. దీంతో మోదీ కాన్వాయ్ ఒక ఫ్లైఓవర్ పై 15 నుంచి 20 నిమిషాల పాటు నిలిచిపోయింది. దాంతో మోదీ అక్కడే కారులో ఉండిపోయారు. ఆ తర్వాత మోదీ కాన్వాయ్ తిరిగి వెనక్కి వెళ్లిపోయింది. ఈ భద్రతా వైఫల్యాన్ని కేంద్ర హోంశాఖ చాలా సీరియస్ గా తీసుకుంది. దీనిపై తక్షణమే నివేదికను ఇవ్వాలని పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

వివరాల్లోకి వెళ్తే, పంజాబ్ లోని జాతీయ అమరవీరుల స్మారకం ఉన్న హుస్సేనివాలకు మోదీ వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో ఆ ప్రాంతానికి 30 కిలోమీటర్ల దూరంలోని ఫ్లైఓవర్ వరకు ప్రధాని కాన్వాయ్ చేరుకుంది. అయితే మోదీ కాన్వాయ్ ను అక్కడ నిరసనకారులు అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా అలర్ట్ అయిన మోదీ వ్యక్తిగత భద్రతా సిబ్బంది వెంటనే కాన్వాయ్ ని ఆపేశారు. దీంతో ఫ్లైఓవర్ పై కారులోనే మోదీ వుండిపోయారు. ఇది ప్రధాని భద్రతకు సంబంధించి అతిపెద్ద వైఫల్యమని కేంద్ర హోంశాఖ వ్యాఖ్యానించింది. వాతావరణం అనుకూలంగా లేని కారణంతో చివరి నిమిషంలో జాతీయ అమరవీరుల స్మారకం వద్దకు వెళ్లేందుకు రోడ్డు మార్గాన్ని ఎంపిక చేశామన్నారు.

ఈ ప్రయాణానికి సంబంధించిన ప్లాన్ లో మార్పులు చేశామని.. రోడ్డు మార్గం గుండా అక్కడకు వెళ్లేందుకు ప్లాన్ మారిందని... అది 2 గంటల రోడ్డు ప్రయాణమని కేంద్ర హోంశాఖ తెలిపింది. భద్రతా ఏర్పాట్లన్నీ సక్రమంగా ఉన్నాయంటూ పంజాబ్ డీజీపీ నుంచి కర్ఫర్మేషన్ వచ్చిన తర్వాతే ప్రధాని కాన్వాయ్ బయల్దేరిందని చెప్పింది. రోడ్డు మార్గంలో ప్రధాని ప్రయాణిస్తున్నారని తెలిసినా పంజాబ్ ప్రభుత్వం అదనపు సెక్యూరిటీ ఏర్పాట్లను చేయలేదని తెలిపింది. ప్రయాణానికి విఘాతం కలిగిన నేపథ్యంలో మోదీ కాన్వాయ్ భటిండా ఎయిర్ పోర్టుకు తిరిగి వచ్చిందని వెల్లడించింది. ఈ భద్రతా వైఫల్యాన్ని చాలా సీరియస్ గా పరిగణిస్తున్నామని... పూర్తి స్థాయి నివేదికను ఇవ్వాలని పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించామని పేర్కొంది.

ప్ర‌ధాని పంజాబ్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా రైతులు త‌మ నిర‌స‌న‌ను వ్య‌క్తం చేయ‌డంతో 20 నిమిషాల పాటు ఫ్లైఓవ‌ర్‌పైనే ప్ర‌ధాని మోదీ కాన్వాయ్ నిలిచిపోయింది. ఈ వ్య‌వ‌హారంపై బీజేపీ పంజాబ్ ప్ర‌భుత్వంపై భ‌గ్గుమంది. ఇక‌.. పంజాబ్ సీఎం చెన్నీ కూడా అంతే స్థాయిలో బీజేపీకి కౌంట‌ర్ ఇచ్చారు. పంజాబ్ ప్ర‌భుత్వంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ న‌డ్డా తీవ్రంగా మండిప‌డ్డారు. ప్ర‌ధాని కాన్వాయ్ విష‌యంలో పంజాబ్ సీఎం చ‌న్నీకి ఫోన్ చేస్తే, క‌నీసం అందుబాటులోకి కూడా రాలేద‌ని తీవ్రంగా మండిప‌డ్డారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తీవ్ర ఓట‌మి త‌ప్ప‌ద‌న్న భ‌యంతోనే పంజాబ్ స‌ర్కార్ ప్ర‌ధాని మోదీ కార్య‌క్ర‌మాన్ని విఫ‌లం చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు చేసింద‌ని న‌డ్డా మండిప‌డ్డారు.

ప్ర‌ధాని మోదీ భ‌ద్ర‌త విష‌యంలో బీజేపీ చేస్తున్న ఆరోప‌ణ‌ల‌పై పంజాబ్ సీఎం చ‌ర‌ణ్‌జిత్ సింగ్ చెన్నీ స్పందించారు. ప్ర‌ధాని భ‌ద్ర‌త విష‌యంలో తమ ప్ర‌భుత్వం ఎలాంటి అల‌స‌త్వం వ‌హించ‌లేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. భ‌టిండా నుంచి ఫిరోజ్ పూర్‌కు రోడ్డుమార్గం ద్వారా ప్ర‌యాణించాల‌ని చివరి నిమిషంలో తీసుకున్న నిర్ణ‌య‌మ‌ని పేర్కొన్నారు. రోడ్డు మార్గం గుండా ప్ర‌యాణించాల‌ని అప్ప‌టిక‌ప్పుడు నిర్ణ‌యించుకున్నారు. ఇక తనను ఇటీవల కలిసిన కొందరు సన్నిహితులు కరోనా పాజిటివ్ కు గురయ్యారని.. ఆ కారణంగా తాను ప్రధానిని ఆహ్వానించేందుకు ఎయిర్ పోర్టుకు వెళ్లలేదని చెప్పుకోచ్చారు. ‘రాజ‌కీయాల కార‌ణాల రీత్యానే త‌మ ప్ర‌భుత్వంపై బీజేపీ త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తోంది’ అంటూ చ‌న్నీ మండిప‌డ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles