దుస్తులు, చెప్పులపై వస్తు సేవల పన్ను(జీఎస్టీ) పెంచుతూ, ఇక ఆటో ప్రయణాలపై కూడా జీఎస్టీని విధిస్తూ.. కరోనా కష్టకాలం దాటి బతుకు జీవుడా అంటూ అంగలార్చుతూ బతికివున్న పేద, మధ్యతరగతి వర్గాలపై మరోమారు పన్నుపోటుతో కేంద్రం కొరడా ఝళిపించింది. అయితే దుస్తులపై ప్రస్తుతం విధిస్తున్న 5శాతం జీఎస్టీని మాత్రం యధాతధంగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. దేశంలోని పలు రాష్ట్రాల నుంచి వచ్చిన వినతులు, వ్యాపారుల నుంచి వచ్చిన వ్యతిరేకత నేపథ్యంలో కేంద్రం ఎట్టకేలకు వెనక్కు తగ్గక తప్పలేదు. దుస్తుల విషయంలో వచ్చేఏడాది ఫిబ్రవరిలో జరిగే జీఎస్స్టీ మండలి 47సమావేశంలో మరోసారి చర్చించి తుదినిర్ణయం తీసుకోనున్నారు.
ఈలోగా అన్నిరాష్ట్రాల అర్థికమంత్రుల నుంచి నివేదికలను తీసుకుని దానిపై పరిశీలించిన తరువాత.. దుస్తులపై జీఎస్టీ పెంపును విధించాలా.? అన్నదానిపై తుదినిర్ణయానికి రానున్నారు. దుస్తులు, చెప్పులపై 5 శాతంగా ఉన్న జీఎస్టీని 12 శాతానికి పెంచునున్నామని కేంద్రం ఇటీవల ప్రకటించింది. గత సెప్టెంబర్ లో జరిగిన జీఎస్టీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే పెంచిన జీఎస్టీ 2022, జనవరి 1 నుంచి వర్తించనున్నట్లు తెలిపింది. అయితే ఇవాళ అత్యవసరంగా సమావేశమైన జీఎస్టీ కమిటీ దుస్తులపై జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది.
అయితే దీనిపై చేనేత కార్మికులు, వ్యాపారుల నుంచి తీవ్రఅభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కేంద్రం నిర్ణయంతో వేలాది మగ్గాలు మూలనపడటంతో పాటు లక్షలమంది నిరుద్యోగులుగా మారుతారని పలు రాష్ట్రాల నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రేట్లు పెంచడంవల్ల చిరు వ్యాపారులపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వెలిబుచ్చాయి. దీంతో వెనక్కి తగ్గిన కేంద్రం దుస్తులపై జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఇవాళ ఢిల్లీలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన నిర్వహించిన జీఎస్టీ మండలి 46వ అత్యవసర సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు.
కాగా, ఆన్లైన్, ఈ–కామర్స్ ఫ్లాట్ ఫామ్ల ద్వారా పొందే సేవలపై కూడా జీఎస్టీ చెల్లించాల్సిందే. స్విగ్గీ, జొమోటో, ఫ్లిప్ కార్ట్, అమెజాన్, మింత్రా లాంటి ఈ కామర్స్ సైట్లతో పాటు ఫుడ్ డెలివరీ యాప్ ల ద్వారా పొందే సేవల పైనా టాక్సు చెల్లించాల్సిందే.. ఇక దీంతో పాటు ట్రాన్స్పోర్టు రంగంలో ఉన్న ఓలా, ఊబెర్ సంస్థలు అందించే సేవల పైనా 5 శాతం జీఎస్టీ చెల్లించాల్సిందే. ఓ వైపు వంటింట్లో గ్యాస్ ధరతో మంటపెట్టిన కేంద్రం.. మరోవైపు ఇంధన ధరలను గణనీయంగా పెంచింది. సామాన్య మద్యతరగతి ప్రజలను టార్గెట్ చేసిన కేంద్రం.. వారిని పన్నుల పేరుతో నిలువుదోపిడి చేస్తోందన్ని విమర్శలు వినిపిస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more