ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. దళిత వర్గానికి చెందిన ఓ బాలిక పట్ల ఓ కుటుంబానికి చెందిన కొందరు వ్యక్తులు అమానుషంగా వ్యవహరించారు. బాలికపై దొంగతనం అరోపణలు పెట్టి.. సభ్యసమాజం తలదించుకునేలా ప్రవర్తించారు. సినిమాల్లో పోలీసుల టార్చర్ పెట్టే విధానాన్ని వంటపట్టించుకున్న ఈ కుటుంబసభ్యులు.. అదే తరహాలో బాలిక అరికాళ్లపై లాఠీతో దారుణంగా కోట్టారు. అమెను జుట్టు పట్టుకుని లాగుతూ.. కాలు పట్టుకుని ఈడ్చుతూ.. అత్యంత పాశవికంగా హింసించారు. ఇందుకు సంబంధించి వీడియో వైరల్ కావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
అయితే ఈ వీడయోను తన అకౌంట్ ద్వారా పోస్టు చేసిన కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంకా గాంధీ ఉత్తర్ ప్రదేశ్ లోని యోగి అధిత్యనాత్ సర్కారును తీవ్రంగా దుయ్యబట్టారు. ఉత్తర్ ప్రదేశ్ లో రోజుకు 34 ఘటనలు దళితులకు వ్యతిరేకంగానే జరుగుతున్నాయని.. ఇక మహిళలకు వ్యతిరేకంగా రోజుకు 135 ఘటనలు జరుగుతున్నాయని అయినా.. రాష్ట్రంలో మాత్రం శాంతిభద్రతలు అమోఘమని కితాబిచ్చుకుంటున్నారని అమె ధ్వజమెత్తారు. 24 గంటల వ్యవధిలో ఈ బాలికపై జరిగిన అమానుష ఘటలో నిందితులను అరెస్టు చేయకపోతే కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో ధర్నాను చేపట్టి ప్రభుత్వ మెండినిద్రను మేలుకొల్పుతుందని హెచ్చరించారు.
ఈ వీడియోలో.. ఇద్దరు వ్యక్తులు ఆమె కాళ్లను కర్రతో పట్టుకోగా.. మరో వ్యక్తి ఆమెపై కర్రలతో విచక్షణ రహితంగా కొట్టారు. జుట్టు పట్టుకుని లాగడంతో పాటు కాలు పట్టుకుని ముందుకు ఈడ్చాడు. దెబ్బలకు తాళలేక బాలిక ఏడుస్తూ ఉంటే.. వారి కఠిన హృదయాలు మాత్రం కరగలేదు. ఇప్పటికైనా నిజం ఒప్పుకో అంటూ కొట్టారు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు కూడా బాలికను తీవ్రంగా దూషించారు. నిజం చెప్పేవరకు తగలించు అంటూ బాలికను కొడుతున్న వ్యక్తికి వంతపాడారు. బాలికను కొడుతూ ఉంటే అక్కడ ఉన్నవారు వీడియో తీస్తూ పైశాచికంగా ప్రవర్తించారు. కాగా, ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో అమేథీ పోలీసులు నిందితులపై పోక్సో, ఎస్సీఎస్టీ అట్రాసిటీ కింద కేసులను నమోదు చేశారు.
ఈ ఘటన ప్రస్తుతం యూపీలో తీవ్ర దుమారాన్ని రేపుతుంది. అమేథీ పోలీసు అధికారి అర్పిత్ కుమార్ మాట్లాడుతూ.. బాలికను మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఒకరిని అరెస్టు చేసినట్లు తెలిపారు. పరారీలో వున్న మిగతా వారికోసం గాలిస్తున్నట్టు తెలిపారు. యోగి ప్రభుత్వం కేవలం అధికారం కోసం మాత్రమే చూస్తుందని.. ప్రజల భద్రతను పట్టించుకోవడం లేదని ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ ఘటన ప్రస్తుతం యూపీలో కలకలం రేపుతుంది.
अमेठी में दलित बच्ची को निर्ममता से पीटने वाली ये घटना निंदनीय है। @myogiadityanath जी आपके राज में हर रोज दलितों के खिलाफ औसतन 34 अपराध की घटनाएं होती हैं, और 135 महिलाओं के ख़िलाफ़, फिर भी आपकी कानून व्यवस्था सो रही है।…1/2 pic.twitter.com/mv1muAMxkr
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) December 29, 2021
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more