ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలో ఇవాళ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటు ప్రభుత్వ దేవాదాయశాఖ అధికారులకు.. అటు రామతీర్థం దేవాలయ అనువంశిక ధర్మకర్త మండలి చైర్మన్ మధ్య తోసివేతకు కారణమైంది. కేంద్ర మాజీ మంత్రి, ధర్మకర్తల మండలి చైర్మన్ అశోక్ గజపతి రాజును ప్రభుత్వ అధికారులు తోసివేయడంతో ఆయనకు పరాభవం ఎదురైంది. అనువంశిక ధర్మకర్తల మండలి చైర్మన్ గా కొనసాగుతున్న ఆయన పరిధలోని దాదాపు 105 ఆలయాలు వున్నాయి. అయితే వాటిలోని రామతీర్థంలో కొలువైన కోదండరామ దేవాలయం పునర్నిర్మాణానికి శంఖుస్థాపన సందర్భంగా ఆయనకు పరాభవం ఎదురైంది.
రామతీర్థం బోడికొండపై ఇవాళ కోదండరామ ఆలయ నిర్మాణ శంకుస్థాపన కోసం.. దేవాదాయశాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం తరపున శిలాఫలకాలను తీసుకువచ్చి ఏర్పాటు చేస్తుండగా వచ్చిన అశోక్ గజపతి రాజు దానిని నిలిపివేయాలని అదేశించారు. శంకుస్థాపన అంశంపై ధర్మకర్తల మండలి ఆలయ ధర్మకర్తగా ఉనన్ తనకు ఎలాంటి సమాచారం లేకుండా.. తనతో చర్చించకుండా ఇలా శిలాఫలకాలు ఏర్పాటు చేయడమేంటంటూ అశోక్ గజపతి రాజు ఆక్షేపించారు. ఆలయ అధికారులు వైసీపీ సర్కారు తరఫున శంకుస్థాపన ఫలకాలను ఎందుకు ఏర్పాటు చేశారంటూ వాటిని అశోక్ గజపతి రాజు తోసివేసి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలోనే అధికారులకు, ఆయనకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. శిలాఫలాకాన్ని ఆయన కింద పెడుతుండగా, అధికారులు తనను వెనక్కు తోసేస్తున్నారని అశోక్ గజపతి చెప్పారు. దీంతో ఆగ్రహానికి గురైన ఆయన.. ‘‘ఈ ఆలయాలకు ధర్మకర్తను నేను.. తనకు తెలియకుండా ఈ తమాషా ఎందుకు చేస్తున్నారు’’ అని ఆయన ప్రశ్నించారు. ఇది ప్రభుత్వ కార్యక్రమం కాదని, ఒకవేళ సర్కారు కార్యక్రమమైతే తాను ఇక్కడ ఉండేవాడిని కాదని చెప్పారు. గతంలోనూ తన పట్ల ఇదే రీతిలో వ్యవహరించారని అన్నారు. ఆలయ మర్యాదలను ఎందుకు పాటించడం లేదంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. అధికారులు, పోలీసులు ఆయనను సముదాయించేందుకు ప్రయత్నించినా ఆయన వినిపించుకోలేదు.
ఆలయ ప్రాంగణంలో తమాషాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆలయం వద్ద కూడా రాజకీయాలు చేయడం ఏంటని ఆయన నిలదీశారు. ఏడాది కాలంలో ఆలయాన్ని పునర్ నిర్మిస్తామని చెప్పి ప్రగల్బాలు పలికిన ప్రభుత్వం.. ఏడాది కావస్తున్నా ఇంకా శంఖుస్థాపనలు మాత్రమే చేస్తోందని.. ఆలయ నిర్మాణం కన్నా వీరికి శిలాఫలకాలు, వాటిపై పేర్ల పైనే ఎక్కువ ద్యాస ఉందని విమర్శించారు. ఈ రామతీర్థం ప్రాంతంలో ఏం చేయాలన్న ఆలయ ధర్మకర్త అనుమతి లేకుండా ఎలా నిర్వహిస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మంత్రులు పుష్ప శ్రీవాణి, వెల్లంపల్లి పాల్గొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more