హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలీలో ఘోర కారు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో వేగంగా దూసుకొచ్చిన కారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ) వద్ద అదుపుతప్పి డివైడర్ మధ్యలో ఉన్న చెట్టును ఢీకొట్టింది. సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలోని గచ్చిబౌలి పోలిస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు ఘటనాస్థలంలోనే మృత్యువాత పడ్డారు. మరో యువకుడు తీవ్రంగా గాయపడగా, చికిత్స నిమిత్తం అసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగి క్షతగాత్రుడ్ని అసుపత్రికి తరలించారు.
ఈ ప్రమాదంలో తెలుగు టెలివిజన్ రంగానికి చెందిన ఇద్దరు మహిళా జూనియర్ అర్టిస్టులతో పాటు కారు నడుపుతున్న బ్యాంకు ఉద్యోగి అక్కడికక్కడే మృతిచెందారు. కారు అతివేగంగా గచ్చిబౌలి నుంచి శేరిలింగంపల్లి వైపు వెళ్తండగా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం వద్ద రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొట్టింది. దీంతో కారు ఏకంగా రెండు భాగాలుగా ధ్వంసమైంది. అయితే కారు ప్రమాదంలో మరణించిన ముగ్గురు మద్యం మత్తులోనే వున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.
మృతులను బ్యాంకు ఉద్యోగైన అబ్దుల్ రహీమ్ (విజయవాడ), ఎం మానస (మహబూబ్నగర్), ఎన్ మానస (కర్ణాటక)గా గుర్తించారు. అబ్దుల్ రహీం బ్యాంక్ ఉద్యోగికాగా, మహిళలు ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు. గాయపడిన వ్యక్తి సిద్ధు అలియాస్ సాయి సైదులు అని, అతడు కూడా జూనియర్ ఆర్టిస్టుగా పనిచేస్తున్నాడని చెప్పారు. వీరు అమీర్పేటలోని హాస్టల్ ఉంటున్నారని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదానికి మద్యం మత్తు కారణమని క్షతగాత్రుడైన జూనియర్ అర్టిస్టు సాయి సిద్దూ తెలిపాడు.
ఆయన మాటల్లోనే.. ఉదయాన్నే షూటింగ్ ఉందని రాత్రి మా ఇంటికి వచ్చారు. సిట్టింగ్ వేశాం. ముగ్గురు మందు తాగారు. నేనెం తాగలేదు. అబ్ధుల్ బ్లాక్ డాగ్ తాగాడు. ఇద్దరు అమ్మాయిలు బీర్లు తాగారు.మందు తాగిన తర్వాత రాత్రి ఒంటి గంట సమయంలో టీ తాగుదాం అన్నారు. ఈ టైంలో ఎందుకు బయటకు వెళ్లడం..డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే ప్రాబ్లం అవుతుందని చెప్పాను. అయినా ఆ ఇద్దరు అమ్మాయిలు వినలేదు. టీ తాగుదామని చెప్పారు. తోడు వెళ్లకపోతే బాగోదని నేను కూడా వెళ్లాను. నాకు డ్రైవింగ్ రాదు. అబ్దుల్ కారు నడిపాడు. అప్పటికే బాగా తాగేసి ఉన్నాడు. గచ్చిబౌలి నుంచి స్పీడ్గా వస్తుంటే ప్రమాదం జరిగింది. నేను మందు తాగలేదు. నాకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తే జోరో వచ్చింది అని పేర్కొన్నాడు.
A speedy car split into 2 parts after hit a tree, 3 people were dead on the spot and 1 suffered serious injuries at #Gachibowli area in #Hyderabad on Saturday.
— Surya Reddy (@jsuryareddy67) December 18, 2021
The deceased are 2 female junior artists and a bank employee.#caraccident#Carsplits2parts #DrunkandDrive pic.twitter.com/ZLWc4VQx2w
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more