కరేబియన్ దీవుల్లోని డొమినికన్ రిపబ్లిక్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ప్రముఖ సంగీత నిర్మాత దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో ఆయనతో పాటుగా తొమ్మిది మంది దుర్మరణం చెందారు. ఏడుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బందితో కూడిన ఓ ప్రైవేటు విమానం డొమినికన్ లోని లా ఇసబెల్లా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫ్లోరిడా వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. విమానాశ్రయం నుంచి జెట్ విమానం టెకాఫ్ అయిన 15 నిమిషాలకే రాజధాని శాంటో డొమింగోలో ఉన్న లాస్ అమెరికాస్ విమానాశ్రయంలో అత్యవసరంగా లాండ్ అయింది.
ఈ క్రమంలో విమానం ల్యాండ్ అవుతూనే పేలిపోయింది. ఈ దర్ఘుటనలో తొమ్మిది మంది మరణించారని విమానయాన సంస్థ వెల్లడించింది. ఈ ఘటనలో లాటిన్ మ్యూజిక్ ప్రోడ్యూసర్ కుటుంబం మరణించిందని తెలిపారు. ప్యూర్టోరికోకు చెందిన మ్యూజిక్ ప్రొడ్యూసర్ జోస్ ఏంజల్ హెర్నాన్డెజ్ అలియాస్ ఫ్లో లా మూవీ మరణించారు. కుటుంబంతో పాటుగా ఆయన క్రిస్టమస్ హాలీడేస్ సందర్భంగా సరదాగా పర్యటనకు వెళ్లి కుటుంబంతో పాటుగా విమాన ప్రమాదంలో మరణించారు. ఆయనతో పాటు ఆయన భార్య (31), వారి నాలుగేళ్ల కుమారుడు కూడా ఉన్నారు. ఈ చిన్నారితో పాటు మరో విమానంలో 13ఏళ్ల చిన్నారి కూడా దుర్ఘటనలో మరణించాడని విమాన సంస్థ యాజమాన్యం హెలిడోసా ఏవియేషన్ గ్రూప్ తెలిపింది.
ఈ దర్ఘుటనలో మొత్తంగా ఆరుగురు అమెరికన్ పర్యాటకులు మరణించారని పేర్కోన్న విమాన సంస్థ.. ఇద్దరు విమాన సిబ్బందితో పాటు ఒక స్టీవార్డ్ కూడా ఉన్నారని ప్రకటనలో తెలిపింది. ఈ ఘటన నేపథ్యంలో లాస్ అమెరికా విమానాశ్రయంలో దాదాపు రెండు గంటల వరకు విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాగా సంగీత నిర్మాతకు సహచర సంగీత ప్రముఖులు, సహచరులు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. సంగీత నిర్మాత జోస్ ఏంజల్ హెర్నాన్డెజ్ కుదర్చిన బాణీలను వింటూ పలువురు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. అనూహ్య ఘటన పట్ల ఆయనత అభిమనాులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more