కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా తన ప్రభావాన్ని చాటుతూనే వుంది. తాజాగా సౌతాఫ్రికాతో పాటు హాంగ్ కాంగ్ లో వెలుగుచూసిన ఒమిక్రాన్ వేరియంట్ కూడా అందోళనకర వేరియంటేనని.. ఇక అది కూడా ప్రమాదకారేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఒమిక్రాన్ ను కట్టడి చేయడానికి బూస్టర్ డోస్ ఒక్కటే మార్గమని బ్రిటన్ దేశం ప్రకటించగా, ఇది వాక్సీన్ నుంచి పొందిన రక్షణ వ్యవస్థను కూడా ఏమార్చగలదని ప్రపంచ అరోగ్యసంస్థ తాజాగా తెలిపింది. అయితే ఈ విషయంలో ఇప్పటికీ క్లారిటీ లేదని.. ఇక మరింత డేటా లభ్యం అయిన తరువాత కానీ దీనిని విశ్లేషించలేమన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
కాగా, కరోనా వ్యాక్సిన్ వేయించుకునేందుకు నిరాకరించిన 27 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తున్నట్లు అమెరికా ఎయిర్ ఫోర్స్ తెలిపింది. తమ సంస్థలో ఫస్ట్ సర్వీస్ సభ్యులుగా వున్న 27 మందిని విధుల నుంచి తొలగించినట్టు ఎయిర్ ఫోర్స్ తెలిపింది. అగ్రారాజ్యంలోని అందరూ కరోనా వాక్సీన్లు వేసుకోవాలని అమెరికాలోని జో బైడెన్ ప్రభుత్వం గత ఆగస్టులో చట్టం చేసింది. ఇందుకుగాను నవంబర్ 2ను చివరి తేదీగా కూడా పేర్కోనింది. అయితే అమెరికా ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాన్ని అర్మీలోని వేలాది మంది ఉల్లంఘించారని ఎయిర్ ఫోర్స్ విభాగం తెలిపింది.
వారిలో ప్రాథమిక సర్వీసు విధుల్లో వున్న 27 మంది సభ్యులను తొలగించామని.. వీరంతా యువత అని.. దిగువశ్రేణిలో విధులు నిర్వహిస్తున్న ఎయిర్ ఫోర్స్ సిబ్బంది అని తెలిపింది. ఎయిర్ ఫోర్స్ లో కొనసాగుతూ ప్రభుత్వ చట్టాలను ఉల్లంఘించడం సమంజసం కాదని పేర్కోంది. ఈ ఏడాది ప్రారంభంలోనే పెంటగాన్ దేశంలోని ఆర్మీ, యాక్టివ్ డ్యూటీ, రిజర్వు దళసభ్యులందరికీ వాక్సీన్లను తెప్పించి.. అందరూ నిర్ధేశిత తేదీలలోగా వాక్సీన్ తీసుకోవాలని అదేశాలను జారీ చేసింది. ఈ సందర్భంగా అమెరికా డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ అస్టిస్.. తమ రక్షణ విభాగం అన్ని విధాల పోరాడేందుకు సమాయత్తంగా వుండాలంటే వాక్సీన్ తీసుకోవడం తప్పనిసరి అని కూడా చెప్పారని అధికారులు తెలిపారు.
ఇలాంటి అదేశాలు.. ఉన్నాతాధికారులు హుకుంలు జారీ అయినా ఈ 27 మంది వైద్యపరంగా, పాలనాపరంగా, మతవిశ్వాసాల పరంగా ఎలాంటి ఎలాంటి మినహాయింపులు పొందకుండా.. కరోనా వాక్సీన్ పై దేశ చట్టాలను ఉల్లంఘించారని అదికారులు తెలిపారు, డిపెన్స్ విభాగంలోని ఎయిర్ ఫోర్స్ మాత్రమే కరోనావాక్సీన్ తీసుకోని సిబ్బంది విషయంలో ఇలాంటి చర్యలకు ఉపక్రమించింది. ఆర్మీలో కొనసాగుతున్న సిబ్బంది తప్పకుండా క్రమశిక్షణతో వ్యవహరించాల్సి ఉంటుందని అన్నారు. కాగా తాజా గణంకాల ప్రకారం ఎయిర్ పోర్స్ లోని 1000 మంది సిబ్బంది వాక్సీన్ ను నిరాకరించారు.
కాగా, 4700మంది సిబ్బంది మతపరంగా వాక్సీన్ నుంచి మినహాయింపు పొందారని తెలిపారు. త మిగతా వారంతా వీరికి కింద విధులు నిర్వహించే కిందిస్థాయి అధికారులేనని తెలిపింది. తొలి జాబితాగా 27 మంది సభ్యులపై కరోనా వాక్సీన్ తీసుకోని కారణంగా వేటు పడిందని.. తెలిపింది. ఇక మిగతావారిపై కూడా చర్యలకు ఉపక్రమిస్తామని తెలిపింది. ఎయిర్ ఫోర్స్లో దాదాపు 97 శాతం ఉద్యోగులు వ్యాక్సిన్ వేయించుకున్నారని ఎయిర్ ఫోర్స్ అధికార ప్రతినిధి అన్నె స్టెఫానెక్ తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more