బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ మేరకు నీటి ఆయోగ్ కు బీహార్ ముఖ్యమంత్రి లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే రాష్టానికి ప్రత్యేక హోదా కల్పించాలన్సిన అవసరం లేదని దీనిపై స్పందించిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి.. నితీశ్ ప్రభుత్వంలోని మిత్రపక్ష బీజేపికి చెందిన రేణు దేవి వ్యాఖ్యానించారు. కేవలం ఎన్నికలకు వెళ్లాల్పిన తరుణంలోనే నితీశ్ కుమార్ కు రాష్ట్ర అర్థిక పరిస్థితి గుర్తుకువస్తుందని.. ఇందుకోసం ప్రత్యేక హోదా కల్పించాలని ఆయన డిమాండ్ చేయడం జరుగుతుందని అమె ఎద్దేవా చేశారు.
అయితే మరోమారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయమై మీడియాకు వివరించే ప్రయత్నం చేసిన ముఖ్యమంత్రి నితీశ్ కుమార్.. ఢిప్యూటీ సీఎం రేణుదేవిపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. అమకు ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి ఒనగూరే లబ్ది గురించి అవగాహన లేదని అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా కల్పించడంతో రాష్ట్రానికి అనేక పరిశ్రమలతో పాటు కేంద్రం నుంచి పలు రాకాల ప్రివిలేజెస్ కూడా లభిస్తాయని అన్నారు. ఎవరైనా ఈ హోదాను వద్దని అన్నారంటే.. వారికి ఈ హోదా వల్ల కలిగే లబ్దిపై అవగాహన లేకపోవడమే కారణం అవుతుందని అన్నారు.
ఇక బీహార్ రాష్ట్ర అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విధతమే. ”బిహార్ వెనుకబడిన రాష్ట్రమే. ఇది నిజం. ఈ విషయాన్ని ఒప్పుకోడానికి నాకేమీ అభ్యంతరం లేదు. అందుకే మేము ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తున్నాం” అని స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధికి అనేక రకాలుగా తాము ప్రయత్నాలు చేస్తున్నా.. ఇప్పటికే కొన్ని కార్యక్రమాలను చేస్తున్నామని వివరించారు. జనతా దర్బార్ లో భాగంగా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సోమవారం ప్రజలను కలుసుకొని, వారి వినతులను స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. అయితే నీతీ ఆయోగ్ కూడా బిహార్ వెనుకబడిన రాష్ట్రమే అని ఒప్పుకుందని, అందుకే తాము ప్రత్యేక హోదా కావాలని అడుగుతున్నామని వ్యాఖ్యానించారు. అయితే కొన్ని సంవత్సరాలుగా తాము అభివృద్ధికి విశేషంగా తోడ్పడుతున్నామని, మహిళల అభివృద్ధికి కూడా పాటుపడుతున్నామని వివరించారు. 2005 తర్వాత తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం విశేషంగా పురోభివృద్ధి సాధిస్తోందని తెలిపారు. అలాగే అల్లర్లు, బందిపోట్లు కూడా తగ్గిపోయాయని నితీశ్ వివరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more