శ్రీవారి భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు మరో ఘాట్ రోడ్డు నిర్మించాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. ఇవాళ ఉదయం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన టీటీడీ బోర్డు సమావేశంలో భక్తులకు విస్తృత, సురక్షిత ప్రయాణాలకు.. స్వామివారి దర్శనానికి గాను పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వచ్చిన వరదలతో కొండ చరియలు విరిగిపడి ఘాట్ రోడ్లు దెబ్బతిన్న విషయం తెలిసిందే. భవిష్యత్లోనూ ఇలాంటి సమస్యలు తలెత్తకుండా తిరుమల కొండకు మూడో ఘాట్ రోడ్ నిర్మించాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది.
ఇక సమీపంలో ఎప్పుడైనా ఇలాంటి ఘటనలు జరిగిన పక్షంలో భక్తుల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఈ మూడవ ఘాట్ రోడ్డు దోహదపడుతుందని అన్నారు. తిరుమలకు చేరుకున్న స్వామివారి ప్రియభక్తుడు అన్నమయ్య మార్గాన్నే మూడవ ఘాట్ రోడ్డుగా చేయాలని నిర్ణయించుకున్నారు. బాలపల్లి నుంచి తిరుమల అన్నమయ్య మార్గాన్ని ఘాట్ రోడ్ చేయాలని, అక్కడే మరో నడకమార్గం కూడా నిర్మించాలని, అందుకు కావాలిసిన అంచనాలు రూపొందించాలని చైర్మన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మార్గంలో భక్తుల రాకపోకలు జరిగేలా అభివృద్ధి చేస్తామని ఆయన ప్రకటించారు.
హనుమ జన్మస్థలమైన ఆకాశగంగ తీర్థ అభివృద్ధికి ఆర్ట్ డైరెక్టర్ ఆనందసాయి సలహాలు తీసుకోవాలని, ఎక్కడా లేని విధంగా భారీగా హనుమ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సమావేశం నిర్ణయించింది. శైశైలం ఆలయ గోపురానికి బంగారు తాపడం పనులు చేపట్టాలని, రూ.3కోట్లతో వసతి గదుల్లో గీజర్లు ఏర్పాటు, 10కోట్లతో స్విమ్స్లో భవనాలు నిర్మాణం, రూ.12 కోట్లతో మహిళా యూనివర్సిటీలో హాస్టల్ భవనాల నిర్మాణం చేపట్టాలని తీర్మానించింది. జనవరి 13న వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ ద్వారా దర్శనం ప్రారంభించి 10రోజుల పాటు దర్శనం కల్పిస్తామని చైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more