అమెరికాకు బయలుదేరిన విమానంలో విషాదం చేటుచేసుకుంది. విమానంలో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడు మరణించాడు. దీంతో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరి.. మూడు గంటలు పాటు ప్రయాణించిన ఆ విమానం మళ్లీ వెనక్కి మళ్లించాల్సి వచ్చింది. దేశ రాజధాని ఢిల్లీ అంతర్జాతీయ మిమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది. శనివారం ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ-105 విమానం ఢిల్లీ నుంచి నెవార్క్ కు టేకాఫ్ అయ్యి మూడు గంటలకుపైగా ప్రయాణించింది. ఆ సమయంలో ఈ విషాద ఘటన సంభవించింది.
భార్యతోపాటు విమానంలో ప్రయాణించిన అమెరికా జాతీయుడు.. ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఆకాశంలో ఉండగా చనిపోయాడు. దీంతో ఆ విమానాన్ని వెంటనే వెనక్కి మళ్లించి ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేశారు. ఈ మేరకు ఎయిర్ ఇండియా సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. ‘ఎయిర్ ఇండియా ఢిల్లీ-నెవార్క్ (యుఎస్) విమానం మూడు గంటలకుపైగా ప్రయాణించిన తర్వాత అత్యవసర వైద్య పరిస్థితి కారణంగా ఢిల్లీకి తిరిగి వచ్చింది’ అని ఎయిర్ ఇండియా అధికారి ఒకరు తెలిపారు. సదరు ప్రయాణికుడిని కాపాడేందుకు విమానం వెనక్కి వచ్చినా ఫలితం లేకపోయింది.
విమానాశ్రయంలోని వైద్యులు విమానంలోకి వచ్చే సరికి సదరు ప్రయాణికుడు చనిపోయాడు. ఈ విషయాన్ని అక్కడి వైద్యులు నిర్ధారించారని ఎయిర్ ఇండియా అధికారులు చెప్పారు. ఈ విషయాన్ని ఎయిర్పోర్ట్ పోలీసులకు చెప్పినట్లు వెల్లడించారు. కాగా, ఫ్లైట్ టైమ్ డ్యూటీ లిమిటేషన్ (ఎఫ్డిటిఎల్) నిబంధనల ప్రకారం విమాన కార్యకలాపాల కోసం మరొక బ్యాచ్ సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు ఎయిర్ ఇండియా అధికారి తెలిపారు. కొత్త సిబ్బందితో అదే విమానం సాయంత్రం 4 గంటలకు అమెరికాకు బయలుదేరుతుందని పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
May 21 | తెలుగు చిత్రపరిశ్రమలో ప్రస్తుతం సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుల జాబితా పెరగడం సంతోషమే. విజయవంతమైన చిత్రాలతో ఆ జాబితాలో నిలిచిన మరో దర్శకుడు అనీల్ రావిపూడి. లో ప్రస్తుతం తలెుగు చిత్రఅనిల్ రావిపూడి దర్శకత్వంలో... Read more
May 20 | రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు పెరిగే అవకాశం ఉన్నదని ఆరోగ్యశాఖ ఆందోళన వ్యక్తంచేస్తోంది. పాత జన్యురూపాన్ని మార్చుకొని వచ్చిన కొత్త రకం (బీఏ4) వైరస్కి వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని టెన్షన్ పడుతుంది. ప్రస్తుతం ఈ... Read more
May 20 | ఓ వైపు వేదమంత్రోచ్ఛరణలు.. మాంగళ్యం తంతునానీనాం.. అంటూ.. వధూవరులను భార్యభర్తలుగా మార్చే పవిత్రమైన మంత్రాన్ని అందుకున్నారు అయ్యవారు. ఇంతలో ఆగండీ అన్న శబ్దం వినిపించింది. కళ్యాణమండపం ప్రధాన ద్వారం వరకు పెళ్లి వేదిక సహా..... Read more
May 20 | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసు నిందితుల ఎన్కౌంటర్ బూటకమని జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ తేల్చిచెప్పింది. నిందితులు పోలీసుల నుంచి తుపాకీలు లాక్కుని కాల్పులు జరిపారన్నది నమ్మశక్యంగా లేదని స్పష్టం చేసింది. నిందితులపై పోలీసులు... Read more
May 20 | రాజకీయాల్లో దూకుడుగా వెళ్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలగాణ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో జనసేన పార్టీ పరిమితి సంఖ్యలో పోటీ చేయబోతోందని అభిమానులకు నూతనోత్తేజం కలిగించేలా... Read more