ప్రపంచాన్ని కరోనా ముప్పు వెంటాడుతూనే ఉన్నది. చైనాలోని వూహాన్ నగరంలో రెండేళ్ల క్రితం పురుడుపోసుకున్న ఈ మహమ్మారి.. యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు తగ్గుతూ వచ్చిన కేసులు.. ఇటీవల మళ్లీ పెరుగుతున్నాయి. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా షాకింగ్ న్యూస్ చెప్పింది. కరోనా కొత్త వేరియంట్ను గుర్తించినట్లు ప్రకటించింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ కొత్త వేరియంట్తో గురించి తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పింది.
కొత్త వేరియంట్కు బీ1.1.529 పేరు పెట్టారు. జెనోమిక్ సీక్వెన్సింగ్ ప్రకారం.. ఇప్పటి వరకు 22 మంది బీ1.1.529 వేరియంట్ బారినపడ్డారు. ఇంతకు ముందు నవంబర్ 19న శ్రీలంకలో కరోనా డెల్టా వేరియంట్ కొత్త వేరియంట్ను గుర్తించారు. దానికి B.1.617.1.AY104గా పేరుపెట్టారు. ఇది శ్రీలంకలో గుర్తించిన మూడో మ్యుటేషన్. కరోనా డెల్టా వేరియంట్ తీవ్ర ప్రభావం చూపుతున్నది. గతంలో పలు దేశాల్లో విస్తృతంగా వ్యాపించిన బి.1.1 కరోనా వేరియంట్ నుంచి ఈ కొత్త వేరియంట్ రూపాంతరం చెంది ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటివరకు కొత్త వేరియంట్ కారణంగా నమోదైన కేసులు 10 మాత్రమే.
కానీ దీంట్లో భీతిగొలిపే రీతిలో ఉన్న జన్యు ఉత్పరివర్తనాల రీత్యా మున్ముందు మరిన్ని కేసులు వెల్లడవుతాయని, ఇప్పటికే వెలుగులోకి రాని కేసులు చాలా ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంట్లోని స్పైక్ మ్యుటేషన్ల అమరికను పరిశీలిస్తే ఇది మానవదేహంలోని మోనోక్లోనల్ యాంటీబాడీలను సులభంగా ఏమార్చగలదని డాక్టర్ టామ్ పీకాక్ వివరించారు. ఈ ఏడాది ప్రారంభంలో, మధ్యలో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా కేసులు నమోదయ్యేందుకు డెల్టా వేరియంటే కారణమని నిపుణులు పేర్కొన్నారు. ఇదిలాఉండగా.. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ప్రయాణికుల్లో బోట్స్వానా, హాంకాంగ్ దేశాల్లోనూ గుర్తించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more