Eggs Hurled At Odisha CM Naveen Patnaik’s Convoy ఒడిశా సీఎంకు పరాభవం.. ఆయన కాన్వాయ్ పై కోడిగుడ్ల దాడి

Eggs hurled at odisha cm naveen patnaik s convoy by bjp supporters in puri

naveen patnaik cm, naveen patnaik odisha, naveen patnak twitter, naveen patnaik twitter, naveen patnaik party, naveen patnaik age, odisha cm, odisha cm name, odisha cm party, odisha cm 2021, puri odisha, BJP, Naveen Patnaik, Odisha

BJP supporters hurled eggs at the convoy of Odisha Chief Minister Naveen Patnaik in Puri on Wednesday, protesting against the government’s “inaction” in the Kalahandi teacher’s kidnap and murder case.

ఒడిశా సీఎంకు పరాభవం.. ఆయన కాన్వాయ్ పై కోడిగుడ్ల దాడి

Posted: 11/24/2021 07:25 PM IST
Eggs hurled at odisha cm naveen patnaik s convoy by bjp supporters in puri

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కు తన సోంత రాష్ట్రం ఒడిశాలో పరాభవం ఎదురైంది. ఆయన కాన్వాయ్‌పై బిజెపి మద్దతుదారులు కోడిగుడ్లతో దాడి చేశారు. కలహండి ఉపాధ్యాయురాలు మమతా మెహర్‌ అపహరణ, హత్యాచార కేసులో ప్రభుత్వ "నిశ్చేష్ట" వైఖరిని నిరసిస్తూ బీజేపి కార్యకర్తలు ఈ దాడికి పాల్పడ్డారు. పూరీ నగరంలోని దర్జీపోఖారీ ఛక్‌ వద్ద బుధవారం ఈ దాడి జరిగింది. హెరిటేజ్ కారిడార్ కింద రూ. 331 కోట్లతో శ్రీ జగన్నాథ్‌ పరికర్మ ప్రాజెక్టు శంకుస్థాపనకు సీఎం పట్నాయక్‌ వెళ్లి తిరిగి వస్తుండగా భారతీయ జనతా యువ మోర్చా(బీజేవైఎం) కార్యకర్తలు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు.

కోడిగుడ్లు నేరుగా ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న కారు అద్దాలకు తగిలాయి. దాడి చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్నాయక్ అశ్వ దళం దాటుతుండగా బీజేపీ కార్యకర్తలు నల్లజెండాలు కూడా ప్రదర్శించారు. ఇక అంతకుముందు సీఎం పట్నాయక్ పూరీలోని గ్రాండ్ రోడ్ లో వెళ్తుండగా, బీజెవైఎం కార్యకర్తలు నల్లజెండాలు ప్రదర్శించారు. వీరితో పాటు యువజన కాంగ్రెస్ విభాగానికి (ఎన్‌ఎస్‌యుఐ) చెందిన ముగ్గురు సభ్యులను అదుపులోకి తీసుకున్నట్లు వర్గాలు తెలిపాయి. కోడిగుడ్ల దాడికి పాల్పడింది తామేనని బీజెవైఎం నాయకులు తెలిపారు. కళంకిత మంత్రులపై చర్యలు తీసుకునేవరకు ఈ నిరసనలు కొనసాగుతాయని హెచ్చరించారు.

హోంశాఖ సహాయ మంత్రి దిబ్య శంకర్‌ మిశ్రాను కేబినెట్‌ నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తూ గత కొద్ది రోజులుగా బీజేపీ నిరసన కార్యక్రమాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు మంత్రుల వాహనాలపై కోడిగుడ్ల దాడులకు పాల్పడింది. మహిళా టీచర్‌ మమతా మెహర్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడు గోబింద సాహుతో శంకర్‌ మిశ్రాకు సంబంధాలున్నాయని బీజేపీ, కాంగ్రెస్‌ ఆరోపిస్తున్నాయి. జగన్నాథ ఆలయం ముందు ఉన్న గ్రాండ్ రోడ్‌పై ఆవు-పేడతో కల్లాపిని చల్లి కళంకిత మంత్రులతో అపవిత్రం కాబడ్డ రోడ్లను "శుద్ధి" చేశామని  పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Eggs hurled at Odisha CM  Navin Patnaik  Odisha CM convoy  Puri  NSUI  BJYM  black flags  Odisha  Politics  

Other Articles