Vizag Better For Capital: CM Jagan త్రీ క్యాపిటల్ ఉపసంహరణ కాదు.. మరింత బలంగా బిల్లు: సీఎం జగన్

Ap govt junks controversial move on 3 capitals withdraws bill in state assembly

Amaravati, Farmers, YS Jagan, Amaravati, Maha Padayatra, Farmers, single Capital, BJP top leaders, 3 Capitals Bill, comprehensive bill, Buggana Rajendranath, CRDA Act, BJP for Amaravati, Andhra Pradesh PoliticsMaha Padayatra, Farmers, Three Capital Bill, Withdraws, CRDA, AP Government, Andhra Pradesh Politics

CM YS Jaganmohan Reddy has announced the repealing of 3 Capitals Bill – AP Decentralisation and Inclusive Development of All Regions Bill, 2020. However, Jagan said that there is no going back on the 3 Capitals. He said the move to repeal the bill is to come up with a more comprehensive bill in the interest of the state and all regions.

త్రీ క్యాపిటల్ ఉపసంహరణ కాదు.. మరింత బలంగా బిల్లు: సీఎం జగన్

Posted: 11/22/2021 04:51 PM IST
Ap govt junks controversial move on 3 capitals withdraws bill in state assembly

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో మూడు రాజ‌ధానుల అంశంపై ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్.. శాస‌న‌స‌భ‌లో కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. మూడు ప్రాంతాల సమఅభివృద్ది కోసం తీసుకువచ్చిన మూడు రాజ‌ధానుల బిల్లును వెన‌క్కి ఉపసంహరిస్తున్నామని స్ప‌ష్టం చేశారు. అయితే అమరాతతిని రాజధానిగా చేస్తామని ఎక్కడ హామీని ఇవ్వని సీఎం.. పూర్తి స‌మ‌గ్ర‌మైన, మెరుగైన బిల్లుతో మ‌ళ్లీ స‌భ ముందుకు వ‌స్తామ‌న్నారు. విస్తృత‌, విశాల ప్ర‌జాప్ర‌యోజ‌నాల‌ను కాపాడేందుకు ఈ నిర్ణ‌యం తీసుకుంటున్నామని ఆయన స్ప‌ష్టం చేశారు.

రాజ‌ధానుల వికేంద్రీక‌ర‌ణ బిల్లు ఆమోదం పొందిన వెంట‌నే మూడు ప్రాంతాల‌కు న్యాయం చేసేలా, మూడు రాజ‌ధానుల‌ ప్ర‌క్రియ ప్రారంభ‌మై ఉంటే ఈరోజు దాన్నుంచి మంచి ఫ‌లితాలు ఈపాటికే అందుబాటులోకి వ‌చ్చి ఉండేవి. నాటి శ్రీబాగ్ ఒడంబడిక స్ఫూర్తితో వెనుక‌బ‌డ్డ ఉత్త‌రాంధ్ర స‌హా అన్ని ప్రాంతాలు కూడా స‌మాన అభివృద్ధి చెందాల‌న్న ఆకాంక్ష‌తో వికేంద్రీక‌ర‌ణ బిల్లును ప్ర‌వేశ‌పెట్ట‌డం జ‌రిగింది. గ‌తంలో ఒక‌చోటే పూర్తిగా కేంద్రీక‌ర‌ణ అయిన ప‌రిస్థితుల మ‌ధ్య ప్ర‌జ‌ల్లో వ్యతిరేకతకు కారణం కారాదని తాము మూడు ప్రాంతాల సమగ్ర సమాభివృద్దికి శ్రీకారం చుట్టాలనే ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు.

మ‌రోసారి హైద‌రాబాద్ లాంటి సూప‌ర్ క్యాపిట‌ల్ మోడ‌ల్ వ‌ద్దే వ‌ద్ద‌ని అటువంటి చారిత్ర‌క త‌ప్పిదాన్ని ప్ర‌భుత్వం పాల్ప‌డ‌రాద‌ని.. 2019 ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు ఇచ్చిన తీర్పు ద్వారా ప్ర‌స్ఫుటంగా వ్య‌క్త‌మైందని అన్నారు. కాబ‌ట్టి వికేంద్రీక‌ర‌ణ స‌రైన విధాన‌మ‌న్న‌ది బ‌లంగా న‌మ్మి అడుగులు ముందుకు వేశాం. అన్ని ప్రాంతాలు కులాలు, మ‌తాలు.. వీరింద‌రి ఆశ‌లు, ఆకాంక్ష‌లను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని, మ‌న ప్ర‌భుత్వాన్ని రెండున్న‌ర సంవ‌త్స‌రాలు మ‌న‌సారరా దీవిస్తూ వ‌చ్చారు. ప్ర‌తి ఎన్నిక‌లోనూ మ‌న పార్టీని ఆశీర్వ‌దించారు.

అయితే వికేంద్రీక‌ర‌ణ‌కు సంబంధించి అనేక అపోహాలు, అనుమానాలు, కోర్టు కేసులు, న్యాయ‌ప‌ర‌మైన వివాదాలు, దుష్ప్ర‌చారాల‌ను ఈ రెండేళ్ల కాలంలో ప్ర‌చారం చేశారు. అంద‌రికీ న్యాయం చేయాల‌న్న ప్ర‌భుత్వ స‌దుద్దేశాన్ని ప‌క్క‌న‌పెట్టి, కొంద‌రికి అన్యాయం జ‌రుగుతుంద‌నే వాద‌న‌ను ముందుకు తోశారు. వికేంద్రీక‌ర‌ణ అవ‌స‌రాన్ని మూడు రాజ‌ధానులకు సంబంధించిన బిల్లులోని ప్ర‌భుత్వ స‌దుద్దేశాన్ని విపులంగా వివ‌రించేందుకు చ‌ట్ట‌ప‌రంగా, న్యాయ‌ప‌రంగా గానీ అన్ని స‌మాధానాల‌తో బిల్లులోనే పొందుప‌రించేందుకు, బిల్లుల‌ను మ‌రింత‌ మెరుగు ప‌ర్చేందుకు స‌మ‌గ్ర‌మైన మెరుగైన బిల్లుతో స‌భ ముందుకు తీసుకువస్తామని అన్నారు.

రాష్ట్రంలో మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో విశాఖ‌లో ఎగ్జిక్యూటివ్ క్యాపిట‌ల్ పెట్టాల‌ని, ఈ ప్రాంతంలో లెజిస్లేటివ్ క్యాపిట‌ల్ పెట్టాల‌ని, క‌ర్నూల్‌లో హైకోర్టు పెట్టాల‌ని నిర్ణ‌యించాం. వికేంద్రీక‌ర‌ణతో మంచి పాల‌న అందించాల‌నే ఉద్దేశంతో అడుగులు ముందుకు వేశాం. విశాఖ‌ప‌ట్ట‌ణం పెద్ద సిటీ. రోడ్లు ఉన్నాయి. డ్రైనేజీ, క‌రెంట్ ఉంది. అన్ని ర‌కాల మౌలిక స‌దుపాయాలు ఉన్నాయి. సుంద‌రీక‌ర‌ణ‌పై దృష్టి సారించి ఉండి ఉంటే.. హైద‌రాబాద్ వంటి పెద్ద న‌గ‌రాల‌తో పోటీ ప‌డే అవ‌కాశం ఉండేది. ఈ నిర్ణ‌యాల‌ను ర‌క‌ర‌కాలుగా వ్య‌తిరేకించారు. న్యాయ‌ప‌ర‌మైన చిక్కుల‌ను సృష్టించారు. ఇటువంటి నేప‌థ్యంలో ఈ ప్ర‌క‌ట‌న చేయాల్సి వ‌స్తోంది అని జ‌గ‌న్ పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles