ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఆర్యన్ ఖాన్ కు బాంబే హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ సంబంధిత నేరాలకు పాల్పడినట్టు ఎలాంటి సానుకూల ఆధారాలు లేవని న్యాయస్థానం స్పష్టం చేసింది. అరెస్టయిన సమయంలో ఇచ్చిన వాంగ్మూలాలు చెల్లుబాటు కావని నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరోకు తేల్చి చెప్పింది. అక్టోబరు 3న ముంబై సముద్ర తీరంలో ఓ క్రూయిజ్ నౌకలో జరుగుతున్న పార్టీని భగ్నం చేసిన ఎన్సీబీ అధికారులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఉండడం సంచలనం సృష్టించింది.
ఈ కేసులో రెండు పర్యాయాలు ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్లు తిరస్కరణకు గురి కాగా, మూడో పర్యాయం బాంబే హైకోర్టులో ఆర్యన్ ఖాన్ కు ఊరట లభించింది. హైకోర్టు ఆర్యన్ కు బెయిల్ మంజూరు చేసింది. తాజాగా, జరిగిన విచారణలో హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నిందితులు ఆర్యన్ ఖాన్, అర్బాజ్ మర్చంట్, మున్ మున్ ధమేచా మధ్య జరిగిన వాట్సాప్ చాటింగుల్లో ఎటువంటి అభ్యంతరకర అంశాలు లేవని పేర్కొంది. ఈ ముగ్గురు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు కుట్ర పన్నుతున్నారని న్యాయస్థానం విశ్వసించే ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది.
నిందితులు ముగ్గురూ ఒకే క్రూయిజ్ నౌకలో ఉండడం ఒక్కటే వారు తప్పు చేశారనడానికి ఆధారం కాబోదని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. దర్యాప్తు అధికారి నిందితుల నుంచి తీసుకున్న నేరాంగీకర వాంగ్మూలాలపై ఎన్సీబీ ఆధారపడరాదని, అవి చెల్లుబాటు కావని పేర్కొంది. ఈ మేరకు తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ముంబై హైకోర్టు తీర్పుపై ఎన్సీపీ అధికార ప్రతినిధి, మహారాష్ట్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి నవాబ్ మాలిక్ మరో మారుసంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో అర్యన్ ఖాన్ కిడ్నాప్ జరిగినట్టు స్పష్టంగా తెలుస్తోందని అభియోగాలు మోపారు. అయితే ఎవరు కి్డ్నాప్ చేశారన్న విషయాన్ని మాత్రం ఆయన వెలిబుచ్చలేదు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more