ఎయిడ్స్ వ్యాధికి మందు లేదు నివారణ ఒక్కటే మార్గమని గత కొన్నేళ్లుగా మనం వింటూనే వున్నాం. అయితే ఇలాంటి భయంకరమైన వ్యాధి ఒక్కసారి వచ్చిందంటే ఇక వారి జీవితం చరమాంకానికి వచ్చిందని ఇన్నాళ్లు ఉన్న అభిప్రాయం. అయితే క్రమంగా ఈ వ్యాధి సోకిన వారికి జీవితకాలాన్ని పెంచేలా కొన్ని చికిత్సవిధానాలు అందుబాటులోకి తీసుకువచ్చింది వైద్యశాస్త్రం. దీంతో వ్యాధిని పెరగకుండా నియంత్రిస్తూనే బాధితుల జీవితకాలన్ని పెంచేందుకు వైద్యురంగంలోని నిపుణులు, శాస్త్రవేత్తలు చేస్తున్న కృషి అభినందనీయం.
కాగా, ఎలైట్ కంట్రోలర్స్ ఈ ప్రాణాంతక ఎయిడ్స్ వ్యాధిని కూడా సర్వసాధారణ వ్యాధిగా మార్చేస్తూ.. ఆ రోగం నుంచి పూర్తిగా విముక్తులు అవుతున్నారు. ఎయిడ్స్ వ్యాధి ఒకసారి సోకిందంటే.. ఇక జీవితాంతం దానిని మోయాల్సిందే అన్న అభిప్రాయాలకు చెక్ పలికేటా వీరు చేస్తున్నారు. అయితే, వ్యాధి ముదరకుండా ఉండేందుకు మాత్రం యాంటీ రిట్రోవైరల్ డ్రగ్స్ ఉన్నాయి. అలాంటి ఈ వ్యాధి నుంచి గతంలో ఒకరు బయటపడగా.. తాజాగా మరో వ్యక్తి ఎలాంటి మందులు వాడకుండానే పూర్తిగా కోలుకున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో హెచ్ఐవి వ్యాధి నుంచి ఎలైట్ కంట్రోలర్స్ తరహాలో ఆ వ్యాధి బాధితులను పూర్తిగా విముక్తులను చేయడంపై దృష్టి సారించారు.
దీంతో వీరిద్దరిపై పరిశోధకులు అధ్యయనం చేస్తున్నారు. వారిలో రోగ నిరోధక వ్యవస్థలు ఎలా పనిచేశాయన్న దానిపై పరిశోధనలు ప్రారంభించారు. ఆ రహస్యాన్ని ఛేదిస్తే విప్లవాత్మక మార్పులు తీసుకురావొచ్చని భావిస్తున్నారు. శరీరంలోకి హెచ్ఐవీ వైరస్ ప్రవేశించిన తర్వాత అది తన జన్యురాశిని ఇతర కణాల డీఎన్ఏలోకి చొప్పించి వాటిని వైరల్ రిజర్వాయర్లుగా మార్చుతుంది. ఆ తర్వాత వీటి నుంచి వైరస్ పుట్టుకొస్తుంది. హెచ్ఐవీ కోసం అందుబాటులోకి వచ్చిన రిట్రో వైరల్ డ్రగ్స్ ఈ రిజర్వాయర్లపై పనిచేసినప్పటికీ వాటిని పూర్తిగా నాశనం చేసే సామర్థ్యం వాటికి లేదు.
ఇంతకీ ఎలైట్ కంట్రోలర్స్ అంటే ఏమిటీ.. కొంతమంది వ్యక్తుల్లోని రోగ నిరోధక వ్యవస్థలు ఎలాంటి ఔషధాలు లేకుండానే వైరస్ ను అణచివేసే శక్తిని కలిగి ఉంటాయి. ఇలాంటి వ్యక్తులను ‘ఎలైట్ కంట్రోలర్స్’గా పిలుస్తుంటారు. ఔషధాల అవసరం లేకుండానే హెచ్ఐవీ నుంచి బయటపడడాన్ని ‘స్టెరిలైజింగ్ క్యూర్’గా పిలుస్తారు. గతంలో బెర్లిన్ దేశానికి చెందిన ఓ వ్యక్తి ఇలానే సోంతంగా బయటపడగా, మరోక లండన్ కు చెందిన రోగి కూడా రోగవిముక్తుడు అయ్యాడని తెలిపారు. కాగా, తాజాగా అర్జెంటినా కు చెందిన ముఫై ఏళ్ల మహిళా రోగి కూడా ఇలానే బయటపడినట్టు శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఈమె 2013లో హెచ్ఐవి వ్యాధి బారిన పడినట్లు నిర్థారించారు.
అయితే ఎలాంటి మందులు వాడకుండా, ఎలాంటి మెడికేషన్ లేకుండా అమె తన జీవితాన్ని తనకు కావాల్సినట్టుగా జీవిస్తూ ఈ వ్యాధి నుంచి బయటపడటం ఆశ్చర్యకర పరిణామాం. దీంతో అమె నుంచి సేకరించిన 119 కోట్ల రక్త కణాలను, 50 కోట్ల కణజాల కణాలను పట్టిపట్టి పరీక్షించినా ఎక్కడా హెచ్ఐవీ జినోమ్ జాడ కనిపించలేదని పరిశోధకులు తెలిపారు. ఎలైట్ కంట్రోలర్స్లో స్టెరిలైజింగ్ క్యూర్ ఎలా జరుగుతుందో కనుక తెలుసుకోగలిగితే హెచ్ఐవీకి పరిష్కారం లభించినట్టేనని మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ వైద్య నిపుణురాలు జూ యూ తెలిపారు. బాధితుల రోగ నిరోధక వ్యవస్థలు తమంత తాముగా స్టెరిలైజింగ్ క్యూర్ను చేపట్టేలా ప్రయోగాలు జరుపుతున్నట్టు వివరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more