ఆంధ్రప్రదేశ్ లో మూడు రోజుల పర్యటన కోసం వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. హస్తినకు పయనమైన చివరి రోజున రాష్ట్ర బీజేపి నేతలకు దిశానిర్ధేశం చేశారు. అమరావతి కోసం ఏడాదిన్నర కాలనికి పైగా ఉద్యమిస్తున్న రైతులకు పార్టీ నేతలు అండగా నిలవాలని, వారి రైతు మహాపాయయాత్రను ఏపీ బీజేపి నేతలు ఎక్కడికక్కడ స్వాగతిస్తూ.. మద్దతు ప్రకటించాలని దిశానిర్ధేశ్యం చేశారు. పాదయాత్రలో పాల్గోనాలని కూడా పిలుపునిచ్చారు. అమరావతి రాజధానిగా ప్రకటించాలని తాము తీర్మానం చేసిన విషయంపై నాయకులు ఎందుకు డోలాయమానంలో పడ్డారని ప్రశ్నించారు.
అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమంలో పాల్గొనాల్సిందేనని షా రాష్ట్ర బీజేపి నేతలకు స్పష్టమైన అదేశాలను ఇచ్చారు. అమరావతి రాజధాని కోసం భూములిచ్చిన రైతులు చేస్తున్న పోరాటానికి అనుకూలంగా జాతీయ స్థాయిలో బీజేపి పార్టీ తీర్మాణం చేసిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన.. వారికి అండగా నిలచి వారి ఉధ్యమాలకు తప్పక వెన్ను దన్నుగా నిలవాలని చెప్పుకోచ్చారు. అమరావతిపై మరో అభిప్రాయం ఎందుకని ప్రశ్నించారు. దీంతో రాష్ట్రానికి చెందిన ఓ సీనియర్ నేత అమరావతి రైతుల అంశాన్ని ప్రస్తావించడంతో ఆయన కొంత సీరియన్ గానే స్పందించారు.
అమరావతి కోసం ఉద్యమిస్తున్నది రైతులేనా.? కాదా.? అని ప్రశ్నించారు. వారు రాజధాని నిర్మాణం కోసం తమ భూములిచ్చిన విషయం వాస్తవమా? కాదా? అని అమిత్ షా ప్రశ్నించారు. అలాగే, ఉద్యమం చేస్తున్నది కూడా రైతులే అయినప్పుడు అభ్యంతరం ఎందుకని ప్రశ్నించారు. ఒకసారి తీర్మానం చేశాక వెనక్కి తగ్గడం ఎందుకన్న కేంద్రమంత్రి.. పాదయాత్రలో పాల్గొనాల్సిందేనని నేతలను ఆదేశించారు. రాష్ట్రంలోని అధికార టీడీపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో పాటు తప్పిదాలను కేంద్రంగా చేసుకుని బీజేపి నేతలు టార్గటె్ చేయాలని కూడా ఆయన సూచించారు. ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీనే ఎంతసేపూ విమర్శించడం సరికాదని, ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలపై ఉద్యమించాలని, ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు సొంతంగా కృషి చేయాలని అమిత్ షా దిశానిర్దేశం చేశారు.
ఇక ఇతర పార్టీల నుంచి బీజేపిలోకి వచ్చి చేరుతున్న నేతలు.. పార్టీ సభ్యత్వం తీసుకోగానే వారు బీజేపి కార్యకర్తలు అవుతారని అన్నారు అమిత్ షా. ఉత్తర్ ప్రదేశ్ లో పార్టీలోకి అనేక మంది ఇతర పార్టీల నేతలు వచ్చి చేరుతున్నారని, అయితే వారందరినీ పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసే పనిలో నిమగ్నం చేశామని, దీంతో పార్టీ పూర్తి స్థాయిలో బలీయంగా తయారైందని అన్నారు. ఇక అస్సోంలోనూ హేమంత్ బిశ్వ శర్మ ఇతర పార్టీ నుంచి వచ్చి బీజేపిలో చేరారని, అయితే ఆయనిప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారని.. పార్టీలో చేరిన వారిని ఎట్టి పరిస్థితుల్లో పక్కనబెట్టే ప్రసక్తే లేదని అన్నారు. అలాగే, పొత్తులపైనా ఎవరూ నోరు మెదపొద్దని, ఈ విషయాన్ని అధిష్ఠానం తేలుస్తుందని స్పష్టం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more