దేశంలో కలకలం రేపిన లఖీపూర్ ఖేరి హింసాత్మక ఘటనపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు దెబ్బకు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం దిగివచ్చింది. ఈ కేసును సమోటోగా తీసుకుని విచారణను ప్రారంభించిన దేశ అత్యున్నత న్యాయస్థానం ఇప్పటికే పలుమార్లు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రప్రభుత్వంపై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కేసులో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల అసహనాన్ని వ్యక్తం చేసింది. అక్టోబర్ 2న జరిగిన ఈ ఘటనపై గడిచిన కొన్ని వారాలలో ఐదవ పర్యాయం ఈ కేసును విచారించింది. కాగా సుప్రీంకోర్టు ఇప్పటికే పలుమార్లు అసహనం వ్యక్తం చేసిన నేపథ్యంటో ఎట్టకేలకు దిగివచ్చిన ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం నిర్ణయానికి కట్టుబడేందుకు అంగీకరించింది.
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ఇవాళ మరోమారు కేసును విచారణ జరపింది. లఖింపూర్ ఖేరీ హింసాత్మక ఘటనపై హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో దర్యాప్తును ఉత్తర్ ప్రదేశ్ సర్కారు అంగీకరించింది. దీంతో ఈ కేసు దర్యాప్తుపై ఆదేశాలను బుధవారం జారీ చేస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. సిట్ బృందంలో సీనియర్ ఐపీఎస్ అధికారులకు చోటు కల్పించాలని, వారి పేర్లను మంగళవారంలోగా రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేయాలని ఆదేశిస్తూ కేసు విచారణను బుధవారానికి వాయిదా వేసింది. విచారణ సందర్భంగా యూపీ ప్రభుత్వం తరఫున హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు.
ధర్మాసనం హైకోర్టుకు చెందిన రిటైర్డ్ జడ్జిలలో ఎవరినైనా ఒక్కరిని ఈ కేసు విచారణ కోసం నియమించవచ్చని తెలిపారు. ఇంతకు ముందు సుప్రీం కోర్టు.. హైకోర్టు మాజీ న్యాయమూర్తిని నియమించాలని గతంలో ప్రభుత్వాన్ని ఆదేశించింది. రిటైర్డ్ న్యాయమూర్తులు రాకేశ్కుమార్ జైన్, రంజిత్ సింగ్ పేర్లను సిఫారసు చేసింది. కొంతమంది సీనియర్ పోలీస్ అధికారులను కూడా సిట్లో చేర్చాలని ఆదేశించింది. ఇంతకు ముందు జరిగిన విచారణలో ఘటనకు సంబంధించిన సాక్షులకు భద్రత కల్పించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. అలాగే హింసాకాండలో జర్నలిస్ట్ రమణ్ కశ్యప్, శ్యామ్ సుందర్ హత్య కేసు దర్యాప్తుపై సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more