ఆపదలో ఉన్నవారిని రక్షించడమే వారి డ్యూటీ. కానీ సీఐ ర్యాంకులో వున్న అధికారులకు నేరుగా సాయం చేయాలంటే కొంత బెరుకు. ఎలాంటి అపత్కాలసమయంలోనైనా వారు తమ కిందస్థాయి సిబ్బందిని పిలిపించుకుని వారితో పనులు చేయిస్తుంటారు. అయితే అందుకు బిన్నంగా ఓ సీఐ స్థాయి మహిళా పోలీసు అధికారిని వ్యవహరించింది. మగవాళ్లే చేయడానికి వెనుకంజ వేసే పనులను కూడా చేసి.. నెట్ జనుల నుంచి ప్రశంసలను అందుకుంటోంది. అంతేకాదు పోలీసు ఉన్నతాధికారుల నుంచి కూడా అమె ప్రశ్నంసలు అందాయి.
వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు రాష్ట్రాన్ని కొద్దిరోజులుగా వర్షాలు ముంచెత్తుతున్న విషయం తెలిసిందే. పుండు మీద కారం చల్లినట్టు.. అసలే వర్షాలతో కుదేలవుతున్న అరవ రాష్ట్రంపై వాయుగుండం ఇవాళ తీరం కూడా దాటింది. దాని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 14 జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. భారీ నుంచి అతిభారీ వర్షాలను చవిచూస్తున్న చెన్నై మహానగరం ఏకబిగిన కురుస్తున్న వర్షాలతో అతలాకుతలం అవుతుంది. చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై వరద నీరు ఏరులై పారుతోంది. అనేక గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. జనజీవనం స్థంభించింది.
ఈ క్రమంలో ఓ మహిళా పోలీసు సాహసానికి తెగించింది. భారీ వర్షాలకు శ్మశాన వాటికలో ఒక చెట్టు కూలడంతో స్పృహ తప్పి అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఓ యువకుడిని కాపాడారు. ఇందుకోసం ఆ యువకుడిని తన భుజాలపై మోసుకెళ్లి ఆటోలో ఆస్పత్రికి తరలించారు. సరైన సమయంలో ఆస్పత్రికి తరలించి ఆ యువకుడిని ప్రాణాలను కాపాడారు. ఈ ఘటన చెన్నైలోని టీపీ ఛట్రం ఏరియాలో జరిగింది. ఆమె మహిళా పోలీసు.. సీఐ రాజేశ్వరి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు హ్యాట్సాఫ్ మేడమ్.. అంటూ సీఐ రాజేశ్వరిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
View this post on Instagram
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more