తెలంగాణలో ప్రేమోన్మాది దారుణానికి ఒడిగట్టగాడు. తన ప్రేమను నిరాకరించిందన్న అక్కస్సుతో ఉన్మాదిలా మారిన యువకుడు యువతిని గొంతుకోసి దారుణంగా హత్యచేశాడు. ఇక యువతి అరుపులు, కేకలు ఇరుగుపోరుగువారికి వినిపించకుండా అమె ఇంట్లోని టీవీ సౌండ్ ను పూర్తిగా పెంచి ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని రామగిరి మండలం, వెంకట్రావుపల్లి గ్రామంలో ఈ దారుణం జరిగింది. కాగా ఘటన తరువాత యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు. సమచారం అందుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
పోలీసుల కథనం ప్రకారం.. వెంకట్రావుపల్లిలోని యైటింక్లైన్ కాలనీ కేకేనగర్ కు చెందిన గొడుగు అంజలి (20) తల్లి లక్ష్మితో కలిసి నివసిస్తోంది. తల్లి కూలి పనికి వెళ్లిన తర్వాత అంజలి ఇంట్లో ఒంటరిగా ఉండేది. తారకరామానగర్ కు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ చాట్ల రాజు (20) యువతి ఒంటిరిగా ఉండటాన్ని గమనించి ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ఆపై ప్రేమ పేరుతో వేధించడం మొదలుపెట్టాడు. దీంతో తన ఇంటికి రావొద్దని అతడికి ఆమె వార్నింగ్ ఇచ్చింది. ఇదే విషయమై ఏడాది క్రితం ఇరు కుటుంబాల మధ్య పెద్దల సమక్షంలో పంచాయితీ కూడా జరిగింది. ఒక్కసారి కాదు ఏకంగా మూడు పర్యాయాలు పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగినా.. రాజు, అంజలీ దేవి వెంటపడటం వీడలేదు.
ఇదిలావుంచితే, అంజలికి ఇటీవల పెళ్లి సంబంధాలు చూస్తున్న విషయం తెలుసుకున్న రాజు ఆమెపై కసి పెంచుకున్నాడు. ఆమె ఇంటికి వెళ్లి వాగ్వివాదానికి దిగాడు. తన ప్రేమను అర్థం చేసుకోమ్మని బతిమాలాడు. అయినా తన తల్లి మాట జవదాటనని అంజలి తేల్చిచెప్పింది. ఈ క్రమంలో తమ మాటలు బయటివారికి వినిపించకుండా టీవీ సౌండ్ పెంచిన రాజు.. అమె నిరాకరిస్తే.. అమెను హత్య చేయాలన్న అప్పటికే రచించుకున్న పథకం ప్రకారం అమెను హత్య చేశాడు. అయితే అంజలి ఇంట్లోని కత్తిపీట కనబడగానే తన పథకాన్ని అమలు చేసేందుకు ఉన్మాదిలా మారిన రాజు అమె గొంతుకోసి దారుణంగా చంపాడు.
అంజలి తల్లి లక్ష్మితో కలిసి పనిచేసే వ్యక్తి ఉపాధిహామీ జాబ్కార్డు ఇచ్చేందుకు నిన్న మధ్యాహ్నం వారింటికి వెళ్లాడు. ఎంతగా పిలిచినా లోపలి నుంచి స్పందన లేకపోవడం, టీవీ సౌండ్ పెద్దగా ఉండడంతో తలుపు తోసుకుని లోపలికి వెళ్లాడు. అక్కడ రక్తపు మడుగులో పడివున్న అంజలి మృతదేహాన్ని చూసి భయంతో వణికిపోయాడు. తేరుకుని బయటకు వచ్చి ఇరుగుపొరుగుకు చెప్పాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు, అంజలిని హత్య చేసిన రాజు అనంతరం పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయినట్టు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more