దేశంలో కలకలం రేపిన లఖీపూర్ ఖేరి హింసాత్మక ఘటనపై ఇవాళ విచారణ జరిపిన దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రప్రభుత్వంపై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కేసులో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల అసహనాన్ని వ్యక్తం చేసింది. సుమోటోగా కేసు విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం గడిచిన కొన్ని వారాలలో మూడవ పర్యాయం ఈ కేసును విచారించింది. ఇదివరకే ఈ కేసు విచారణలో భాగంగా న్యాయస్థానం ప్రభుత్వానికి, ఉత్తర్ ప్రదేశ్ పోలీసులకు పలు ప్రశ్నలు సంధించింది. కాగా తాజాగా కూడా న్యాయస్థానం అదే స్థాయిలో తీవ్ర అసహనం వెలిబుచ్చింది.
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ఇవాళ మరోమారు కేసును విచారణ జరపింది. ఈ ఘటనపై ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం సమర్పించిన స్టేటస్ రిపోర్ట్ పై మరోమారు అసంతృప్తి వ్యక్తం చేసింది. సాక్షులను విచారించామని నివేదికలో పోందుపర్చడం మినహా.. కోత్తగా స్టేటస్ రిపోర్టులో ఏమీ లేదని పేర్కోనింది. హింసాకాండకు కారణమైన 13 మందిని అరెస్టు చేశామని, సాక్షలను విచారించామని మాత్రమే నివేదికలో పోందుపర్చడం ఏమిటని ప్రశ్నించింది. కేంద్రమంత్రి అజయ్ మిశ్రా తనయువు అశీష్ మిశ్రా ఫోన్ ను జప్తు చేయడంపై ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
నిందితులకు సంబంధించిన ఫోన్ కాల్ రికార్డులను తమకు సమర్పించాలని ఉత్తర్ ప్రదేశ్ పోలీసులను అదేశించిన సర్వన్నత న్యాయస్థాన ధర్మాసనం.. సేకరించిన వివరాలను నేరుగా తమకు సమర్పించాలని కూడా అదేశాలు జారీ చేసింది. ఇక ఈ కేసులో ఇతర కేసుల సాక్ష్యాలను ఈ కేసులో ఉపయోగించరాదని స్పష్టం చేసింది. అదే సమయంలో కేసు విచారణను కేంద్ర దర్యాప్తు సంస్థకు (సీబిఐకి) బదిలీ చేసేందుకు నిరాకరించింది. ఈ క్రమంలో అత్యున్నత న్యాయస్థానం ఇద్దరు మాజీ హైకోర్టు న్యాయమూర్తును ఈ కేసు విచారణకు నియమించింది. వీరి సమక్షంలోనే లఖీంపూర్ ఖేరి కేసు విచారణ సాగాలని కోర్టు సూచనలు చేసింది.
అంతుకు ముందు లఖింపూర్ కేసులో ల్యాబ్ నివేదిక సమర్పించకపోవడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనికి స్పందించిన ప్రభుత్వం నవంబర్ 15న రిపోర్ట్ వస్తుందని చెప్పగా.. కోర్టు తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. అప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని ఆదేశించింది. హింసాత్మక ఘటన విచారణ తాము ఆశించిన మేరకు దర్యాప్తు జరుగడం పేర్కొంది. లఖీంపూర్ ఖేరీ కేసు విచారణలో ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం వరుసగా మెట్టికాయలు పడుతున్నా తీరులో ఏలాంటి మార్పు రాలేదు. అంతకుముందు ‘‘ర్యాలీలో నాలుగైదువేల మంది రైతులు ఉంటే.. ప్రత్యక్ష సాక్షులు కేవలం 23 మంది దొరికారా? అని ప్రశ్నించిన న్యాయస్థానం.. సెక్షన్ 164 కింద ఎంతమంది వాంగ్మూలం నమోదు చేశారని కూడా నిలదీసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more