మీకు ఓటరుగా నమోదయ్యే0 వయస్సు తెలుసా.? పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతీ ఒక్కరు ఓటరుగా నమోదు కావచ్చునన్న విషయం తెలుసా.? అయితే మీకు ఆ వయస్సు వచ్చిందా.? లేక వచ్చినా ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఎవరన్ని కలవాలి, ఎక్కడ నమోదు చేసుకోవాలి.. అన్న వివరాలు తెలియక నమోదు చేసుకోలేదా.? లేక మీ ఓటు తొలగించబడిందా.? ఆ తరువాత దానిపట్ల అసక్తి లేకపోవడంతో మీరు మళ్లీ నమోదు చేసుకునే ప్రయత్నాలు చేయలేదా.? అయితే ప్రజాస్వామ్య దేశమైన మన దేశంలో ఓటు హక్కు అన్న విషయం తెలుసా.?.
ప్రజాస్వామ్యం పటిష్టంగా ఉండాలంటే ప్రతీ ఒక్కరు తమ ఓటు హక్కును తప్పక నమోదు చేసుకోవడమే కాదు.. ఎన్నికలలో వినియోగించుకోవాలి కూడా. అప్పుడే దేశంలో ప్రజాస్వామ్యం పరఢవిల్లి ప్రభుత్వాలు ప్రజారంజక పాలనను అందించేందుకు దోహదపడతాయి. ఇవన్నీ సరే కానీ.. ఓటరుగా నమోదు చేసుకోవడం ఎలా.? అంటారా.? ఓటర్ల జాబితా సవరణకు శని, ఆదివారాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. ఇందులో భాగంగా ఇవాళ, రేపు పోలింగ్ బూత్ల వద్ద బీఎల్వోలు అందుబాటులో ఉంటారని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఓటర్ల జాబితాలో సవరణలు, మార్పులు, చేర్పులు చేసుకోవడానికి అవకాశం కల్పించామని, అందరూ ఉపయోగించుకోవాలని తెలిపింది.
2022, జవనరి నాటికి 18 ఏండ్లు నిండినవారు ఓటర్లుగా తమ పేరును నమోదుచేసుకోవచ్చని పేర్కొన్నది. ఆన్లైన్లో కూడా ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, నమోదుకు అవకాశం కల్పిస్తున్నామని అధికారులు వెల్లడించారు. ఆన్లైన్ ద్వారా మార్పులు, చేర్పులు చేసుకోవాలనుకున్నవారు www.ceotelangana.nic.in, www.nvsp.in వెబ్సైట్లు చూడవచ్చని తెలిపారు. ప్రతి ఏడాది ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఎన్నికల కమిషన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఏటా జనవరి 18ని ఓటర్ల దినోత్సవంగా జరుపుకొంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more