కేరళను వరదలు ముంచెత్తుతున్నాయి. అసలే కొండ ప్రాంతమైన కేరళలో భారీ వర్షాల ధాటికి కొండ చరియలు విరిగిపడటంతో రహదారులపై కూడా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇక లోతట్టు ప్రాంతల్లో జాతీయ, రాష్ట్ర రహదారులు జలపాతాళలను తలపిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడుతున్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో రవాణను కూడా అక్కడి ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో కేరళ ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోంటున్నారు. నిత్యావసర సరుకులు కూడా లభ్యం కానంత దారుణ పరిస్థితులు అక్కడ అలుముకున్నాయి.
అయితే ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లోనూ వేదపండితులు పెట్టిన శుభముహూర్తాన్ని దాటిపోనివ్వకుండా అదే ముహూర్తానికి పెళ్లి చేసుకోవాలని భావించారు కేరళ హెల్త్ వర్కర్ జంట. ఇంకేముంది.. పెండ్లి ముహుర్తం ముంచుకురావడంతో ఆకాష్, ఐశ్వర్యల కొత్త జంట పెండ్లి మంటపానికి చేరుకునేందుకు కూడా కొత్త ఐడియా వేశారు. అనుకున్నదే తడవుగా వారి ప్రణాళికను అమలుపర్చారు. భారీగా నీళ్లు నిలిచినా.. ఎంచక్కా తడవకుండానే పెళ్లిమండపానికి చేరుకున్నారు. అదెలా అంటారా.. భారీ వంటపాత్రలను తమ నావలుగా మలుచుకుని వచ్చేశారు.
ఔనా.. అంటారా.. భారీ అల్యూమినియం వంట పాత్రలో వధూవరులిద్దరూ కూర్చుని వచ్చారు. తలవడిలోని ఫంక్షన్ హాల్నూ వరద నీరు ముంచెత్తగా అతికష్టం మీద అక్కడికి చేరుకున్న నూతన వధూవరులు పరిమిత అతిధులు, బంధువుల సమక్షంలో పెండ్లి తంతు కానిచ్చేశారు. పెండ్లి మంటపం సైతం నీటితో నిండిపోయింది. ఇక రోడ్డు జలయమం కావడంతో అల్యూమినియం పాత్రలో వధూవరులు పెండ్లి వేదికకు వస్తున్న దృశ్యాలు పలు టీవీ ఛానెళ్లలో ప్రసారమయ్యాయి.
పెండ్లి ముహుర్తం శుభప్రదమైన రోజున ఖరారు చేయడంతో ఈ ముహూర్తాన్ని చేజార్చుకోవడం ఇష్టం లేని జంట.. ఎలాగైనా అదే సమయానికి పెండ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో వరద నీటితో రోడ్లన్ని జలయమం అయినా.. మరో మార్గం లేక.. అల్యూమినియం వంటపాత్రను తమ నావగా మలుచుకుని పెళ్లిమండపానిక చేరామని నవ దంపతులు చెప్పుకొచ్చారు. గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలతోనే రహదారులతో పాటు పెండ్లి వేదిక నీటమునిగిందని అన్నారు. ఇక నవ దంపతులు ఇద్దరూ చెంగనూర్లోని దవాఖానలో ఆరోగ్య కార్యకర్తలుగా పనిచేస్తున్నారు.
#Kerala couple uses a huge cooking vessel as a makeshift boat to reach their wedding venue amidst #heavyrains #KeralaFloods #KeralaRains pic.twitter.com/NiIUpRcrnc
— Diksha Yadav (@DikshaY62646349) October 18, 2021
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more