కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశరాజధాని ఢి్ల్లీతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో రైతులు ఉద్యమాలు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఏకంగా పది నెలల నుంచి తాము నిరసన దీక్షలు చేపట్టినా కేంద్రం స్పందించడం లేదని.. అగ్రహించిన రైతులు బీజేపి పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు సందర్శించనున్న ప్రాంతాలకు వెళ్లి.. వారిని అడ్డుకుని.. తమ నిరసనలపై అక్రోశాన్ని వెల్లగక్కుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు బీజేపి నేతలపై హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో తమ అవేశంతో వాహనాలను అడ్డుకున్న ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి.
కాగా ఉత్తర్ ప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరీలో అదివారం రోజుల పలువురు రైతులు కేంద్రమంత్రి అజయ్ మిశ్ర తనయుడు ఆశీష్ వాహనాన్ని అడ్డున్నారు. దీంతో రైతులను నెట్టుకుంటూ కేంద్రమంత్రి తనయుడి వాహనంతో పాటు మూడు వాహనాలు అలా వెళ్లడంతో అందోళన చేస్తున్న రైతులలో ఏకంగా నలుగురు రైతులు అసువుల బాసారు. ఈ మూడు ఎస్యూవీ కార్లలో ఒకటి కేంద్రమంత్రి తనయుడు అశీష్ నడిపిస్తున్నారని రైతులు అరోపించారు. ఇక ఈ ఘటనలో మరో నలుగురు కూడా అసువులు బాసారు. ఆగ్రహించిన రైతులు కేంద్రమంత్రి తనయుడిని తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేయడంతో ఆయనపై ఎస్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. ఘటనపై మరో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశామని తెలిపారు,
ఈ ఘటన నేపథ్యంలో రైతుల తీవ్ర ఆవేశంతో రగలిపోయారు. ఈ క్రమంలో ఓ వాహనానికి నిప్పు పెట్టి మరీ ఎత్తి పడేశారు. కాగా, అసువులు బాసిన రైతుకుటుంబాలతో పాటు మరో నలుగురి మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు సోమవారం ఉదయం ప్రియాంక వెళ్తుండగా ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులపై ప్రియాంక గాంధీ మండిపడ్డారు.బాధిత కుటుంబాల కన్నీళ్లు తుడిచేందుకు వెళ్తున్నానని ఆమె పేర్కొన్నారు. తాము ఎలాంటి నేరం చేయలేదు.. ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. తనకు లీగల్ ఆర్డర్ ఇచ్చి అడ్డుకోవాలన్నారు. ఒక వేళ తనను బలవంతంగా పోలీసు కారులో ఎక్కిస్తే.. మీపై కిడ్నాప్ కేసు పెడుతానని హెచ్చరించారు.
దేశంతో పాటు బీజేపి పాలిత రాష్ట్రాల్లో ఆ పార్టీ తీరు విచారకరంగా వుందని అమె దుయ్యబట్టారు. ఈ దేశమే తమదన్నట్లుగా బీజేపీ పాలన సాగుతోందని అక్షేపించారు. భారత్ అంటేనే వ్యవసాయ ఆధారిత దేశమని, అంటే ఇది సంపూర్ణంగా రైతుల దేశమని చెప్పారు. ఈ దేశమే తనదన్నట్లు బీజేపీ వ్యవహరిస్తున్న తీరు సరి కాదని అన్నారు. ఈ దేశంలో తొలుతు జీవించే హక్కు రైతులకే వుందని అమె అన్నారు. అలాంటిది బీజేపి పాలిత రాష్ట్రాల్లో మాత్రం రైతులకు జీవించే హక్కు లేకుండా చేస్తున్నారని అమె మండిపడ్డారు? రాజకీయాలతో రైతులను అణచివేస్తారా? అని ప్రశ్నించారు. గత కొన్ని నెలలుగా రైతులు తమ గళాన్ని వినిపిస్తున్నారు. రైతుల ఆందోళనలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రియాంక గాంధీ కోపోద్రిక్తులయ్యారు.
ఇదిలా ఉండగా ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖీరీ జిల్లాలో రేగిన హింసాత్మతక ఘటనల నేపథ్యంలో మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ భగేల్, పంజాబ్ డిప్యూటీ సీఎం సుఖ్జిందర్ ఎస్ రాంధావా ప్రకటించిన నేపథ్యంలోనూ యూపీలోని యోగి సర్కారు వారికి కూడా అనుమతి నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం లక్నో ఎయిర్పోర్టులో వారిద్దరిని ల్యాండ్ అయ్యేందుకు అనుమతించొద్దని యూపీ అడిషనల్ చీఫ్ సెక్రటరీ అవనిష్ అవస్థి ఎయిర్పోర్టు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. సీతాపూర్ వద్ద ప్రియాంక గాంధీ వాద్రాను పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more