టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నరసరావుపేట పర్యటన ఉత్కంఠభరితంగా మారింది. గుంటూరు జిల్లా నర్సారావుపేటకు వెళ్లేందుకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా గోళ్లపాడులో ఇటీవల ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన అనూష కుటుంబాన్ని పరామర్శించేందుకు లోకేశ్ హైదరాబాద్ నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అయితే, లోకేశ్ ను ఎయిర్ పోర్టు నుంచి పోలీసులు బయటకు రానివ్వలేదు. విమానాశ్రయం లోపలే ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
లోకేశ్ పర్యటనకు అనుమతి లేదని పోలీసులు చెపుతున్నారు. అక్కడి నుంచి ఆయనను ఎక్కడకు తరలిస్తారనే ఉత్కంఠ నెలకొంది. లోకేశ్ కాన్వాయ్ చుట్టూ పోలీసు వాహనాలు అనుసరించాయి. లోకేశ్ మీడియాతోనూ మాట్లాడకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇక ఆయనను ఎక్కడకు తరలిస్తున్నారనే అంశంపై పోలీసులు మాట్లాడకుండా.. అత్యంత గోప్యంగా ఉంచారు. కాగా లోకేశ్ తో పాటు విమానంలో వచ్చిన పలువురు టీడీపీ కీలక నేతలను పోలీసులు అరెస్ట్ చేసి అంబులెన్సులోకి ఎక్కించారు. అనంతరం వారిని విమానాశ్రయంలోని ఇంటర్నేషనల్ టెర్మినల్ వైపు మళ్లించారు. వారందరి నుంచి లోకేశ్ ను దూరం చేసి, విమానాశ్రయం నుంచి తరలించారు.
గత ఫిబ్రవరి 24న ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన అనూష కుటుంబ సభ్యులను పరామర్శించడానికి నారా లోకేశ్ నరసరావుపేట పర్యటనకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలిసి విమానాశ్రయం వద్దకు వద్దకు పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు చేరుకున్నారు. వీరందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని... అక్కడి నుంచి పోలీసు వాహనాల్లో తరలించారు. మరోవైపు టీడీపీ కీలక నేతలందరినీ పోలీసులు ఇప్పటికే గృహనిర్బంధం చేశారు. లోకేశ్ ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై టీడీపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more