వైథ్యనాథ్ జ్యోతిర్లింగ ఆలయాన్ని తక్షణం తెరవాలని డిమాండ్ చేస్తూ సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపి ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. జార్ఖండ్ రాష్ట్రం డియోగఢ్ నియోజకవర్గంలోని బాబా వైథ్యనాథ్ ధామాన్ని తెరువాలని ఆ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే నారాయణ దాస్ సహా పరిసర ప్రాంత నియోజకవర్గాల ఎమ్మెల్యేలు వినూత్న నిరసన చేపట్టారు. నుదిటికి విభూది, మెడలో ఉదారంగు వస్త్రం, ఆకుపచ్చని ప్లాస్టిక్ ఆకుల దండ, ఓ చేతిలో ఢమరుకం, మరో చేతిలో కమండలం ధరించి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో ఢమరుకం వాయిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఆయన వెంట ధియోగఢ్ పరిసర నియోజకవర్గాల బీజేపి ఎమ్మెల్యేలు కూడా ప్లాకర్డులు పట్టుకుని నిరసనకు దిగారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నారాయణ దాస్ మీడియాతో మాట్లాడుతూ.. బాబా బైథ్యనాథ్ జ్యోతిర్లింగ్ ఆలయం కేవలం డియోగఢ్లోనేగాక దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన ఆలయమని, వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు ఆలయానికి వస్తుంటారని చెప్పారు. అంతేగాక, ఆలయాన్ని తెరిస్తే ఎంతో మందికి ఉపాధి లభిస్తుందని నారాయణ దాస్ తెలిపారు.
బాబా బైథ్యనాథ్ ఆలయాన్ని తక్షణమే తెరువాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించేందుకే తాను ఈ వేషధారణలో అసెంబ్లీకి వచ్చానని నారాయణ దాస్ చెప్పారు. లేదంటే అసెంబ్లీ సమావేశాలు ముగియగానే డియోగఢ్ నియోజకవర్గంలో తన నిరసన కొనసాగుతుందని హెచ్చరించారు. ఇదిలావుంటే, బైథ్యనాథ్ ఆలయాన్ని తెరువాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ జరిపింది. అయితే ఆ పిటిషన్పై అత్యవసర విచారణ జరుపాలన్న అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. అర్జంట్ లిస్టింగ్ నుంచి పిటిషన్ను తప్పించింది.
#WATCH | Jharkhand: Narayan Das, BJP MLA from Deoghar, reaches State Assembly premises with a 'damru', demanding reopening of Baba Baidyanath dham in his constituency. pic.twitter.com/VuQnNpL66K
— ANI (@ANI) September 7, 2021
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more