Panjshir captured, say Taliban sources తాలిబన్ల వశమైన పంజ్‌షీర్‌.. అప్ఘనిస్తాన్ పై పూర్తిస్థాయి ఆధిపత్యం

Afghanistan crisis live updates taliban capture panjshir now in full control of afghanistan

Panjshir, Taliban, Islamist militia, Panjshir rebels, Panjshir valley, Amrullah Saleh, Afghanistan, International, Politics

Taliban sources said the Islamist militia had seized the Panjshir valley, the last part of Afghanistan holding out against it. It was not immediately possible to confirm the reports. Former Vice-President Amrullah Saleh, one of the leaders of the opposition forces known as Resistance-2, denied the reports in a video clip. “There is no doubt we are in a difficult situation. We are under invasion by the Taliban... We have held the ground, we have resisted,” he said.

తాలిబన్ల వశమైన పంజ్‌షీర్‌.. అప్ఘనిస్తాన్ పై పూర్తిస్థాయి ఆధిపత్యం

Posted: 09/04/2021 11:49 AM IST
Afghanistan crisis live updates taliban capture panjshir now in full control of afghanistan

ఆఫ్ఘ‌నిస్తాన్ ను పూర్తిగా తమ కబంధహస్తాలలోకి తీసుకున్న తాలిబన్లకు ఇప్పటికే పంజ్‌షీర్‌ కొరకరాని కొయ్యగా మారిందనడంలో సందేహమే లేదు. అయితే ఈ లోయలోని ప్రావిన్సును కూడా స్వాధీనం చేసుకుని తమకు ఎదురులేదని తాలిబన్లు గత రెండు వారాలుగా చేస్తున్న ప్రయత్నాలకు పంజ్ షీర్ దళాల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతున్న విషయం తెలిసిందే. మొన్నటికిమొన్న ఏకంగా 350 మంది తాలిబన్ సేనలను పంజ్ షీర్ దళాలు మట్టుబెట్టాయి. అయితే తాజాగా ఈ లోయప్రాంత ప్రావిన్సుపై కూడా తాము ప‌ట్టు సాధించిన‌ట్లు తాలిబ‌న్లు ప్ర‌క‌టించారు. ఈ వార్తను రెబల్స్ ఖండిస్తున్నా.. అసలేం జరుగుతుందో మాత్రం తెలియని పరిస్థితులు నెలకొన్నాయి.

పంజ్ షీర్ ఎవరికీ దాహోసం కాకుండా చూస్తామని భీష్మించుకున్న రెబ‌ల్స్ మాత్రం భీక‌రంగా పోరాడుతున్న‌ట్లు తెలుస్తోంది. పంజ్‌షీర్ లోయ‌ను స్వాధీనం చేసుకునేందుకు తాలిబ‌న్లు దూకుడును పెంచేశారు. అక్క‌డ హోరాహోరీగా రెండు వ‌ర్గాల మ‌ధ్య ఫైటింగ్ జ‌రుగుతున్న‌ట్లు తెలుస్తోంది. సోవియట్ ద‌ళాల‌కు కూడా చిక్క‌ని పంజ్‌షీర్‌ను తాలిబ‌న్లు హ‌స్త‌గ‌తం చేసుకున్న‌ట్లు రాయ‌ట‌ర్స్ సంస్థ పేర్కొన్న‌ది. పంజ్‌షీర్ సేన‌లు మాత్రం ఈ వార్త‌ల‌ను ఖండిస్తున్నాయి. పంజ్‌షీర్ నేత అమ్రుల్లా స‌లేహ్ తానెక్క‌డికి వెళ్ల‌లేద‌న్నారు. కానీ ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా ఉంద‌న్నారు. పంజ్‌షీర్‌లో జ‌రుగుతున్న ఫైటింగ్‌లో వంద‌ల సంఖ్య‌లో మ‌ర‌ణాలు సంభ‌వించిన‌ట్లు కొన్ని వార్త‌లు వెలుబడుతున్నాయి.

కాబూల్‌కు ఉత్త‌రం దిక్కున ఉన్న పంజ్‌షీర్ లోయ ఓ ప్ర‌త్యేక ప్రావిన్సు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆ ప్రాంతాన్ని తాలిబ‌న్లు వ‌శం చేసుకోలేక‌పోయారు. కానీ రెండు వారాల నుంచి సాగుతున్న పోరు చివ‌రి ద‌శ‌కు చేరుకుని తాలిబన్ల బలగాలు దానిని కూడా హస్తగతం చేసుకున్నాయి. ఈ క్రమంలో దేశం నుండి నిష్క్రమించిన తర్వాత సలేహ్ శుక్రవారం ఒక ట్వీట్‌ చేశారు. పంజ్‌షీర్ ప్రజల బాధాకరమైన అనుభవాలను ఆయన హైలైట్ చేశారు. ‘తాలిబ్‌లు పంజ్‌షీర్‌కి మానవతా సహాయాన్ని నిరోధించారు. పంజ్‌షీర్‌ సైనిక వృద్ధులను మైన్‌ క్లియరెన్స్‌కు వినియోగించుకున్నారు. ఫోన్‌, విద్యుత్‌ సౌకర్యాలను నిలిపివేశారు. ఔషధాలను కూడా అనుమతించడం లేదు. ప్రజలు కొంత మొత్తంలో మాత్రమే నగదు తీసుకెళ్లగలుగుతున్నారు’ అని పేర్కొన్నారు.

ఆఫ్ఘనిస్థాన్‌లో ఎమర్జెన్సీ ప్రారంభమైనప్పటి నుండి గత 23 సంవత్సరాలుగా తాలిబ్ యాక్సెస్ ని తాము ఎన్నడూ నిరోధించలేదని అమ్రుల్లా సలేహ్ పేర్కొన్నారు. తాలిబ్ లు యుద్ధ నేరాలకు పాల్పడుతున్నారని, ఐహెచ్‌ఎల్‌పై వారికి ఎలాంటి గౌరవం లేదని ఆరోపించారు. ఈ స్పష్టమైన నేరాలు, తీవ్రవాద ప్రవర్తనను గమనించాలని ఐరాస, ప్రపంచ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నామని ట్వీట్‌ చేశారు. తాలిబ‌న్ల‌కు తాజాగా వశమైన ఆ లోయ‌లో సుమారు రెండు ల‌క్ష‌ల మంది ఉంటార‌ని అంచ‌నా వేస్తున్నారు. స్థానిక ట్రైబ‌ల్ లీడ‌ర్ అహ్మ‌ద్ మ‌స్సౌద్ నేతృత్వంలో తాలిబ‌న్ల‌కు వ్య‌తిరేకంగా పంజ్‌షీర్ ద‌ళాలు క‌ద‌ం తోక్కినా ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles