ప్రముఖ ఫైనాన్సియల్ సర్వీసెస్ సంస్థ కార్వీలో కుంభకోణం గుట్టును హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు వెలికి తీశారు. ఈ కుంభకోణం మొత్తం విలువ రూ.2700 కోట్లు అని నిగ్గు తేల్చారు. సకాలంలో రుణాలు చెల్లించకుండా ఎగవేతకు పాల్పడిన కార్వీ చైర్మన్ పార్ధసారధిపై బ్యాంకుల ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతని నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు తమ కస్టడీకి అప్పగించాలన్న పోలీసుల వినతిని పరిశీలించిన న్యాయస్థానం గత బుధవారం రెండు రోజుల కస్టడీ అప్పగించిన విషయం తెలిసిందే.
ఈ గడువు నిన్నటితో ముగిసిపోవడంతో శనివారం మరోమారు కస్టడీకి అప్పగించాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈసారి రెండు రోజుల కస్టడీకి అప్పగిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆది, సోమవారాల్లో మరోమారు పార్ధసారధిని పోలీసులు విచారిస్తారు. ఇప్పటికే జరిగిన విచారణలో పార్థ సారధి నుంచి కీలక ఆధారాలను పోలీసులు సేకరించారు. కస్టమర్ల షేర్లను కంపెనీ షేర్లుగా చూపిన కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ.. బ్యాంకుల నుంచి రుణాలు పొందింది. రూ.780 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసినట్లు పార్ధసారధి చెప్పారు. ఆస్తులు అమ్మైనా కస్టమర్ల అప్పులు తీరుస్తానని చెప్పినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, పీటీ వారెంట్పై ఆయనను తీసుకెళ్లి విచారించేందుకు మూడు రాష్ట్రాల పోలీసులు కసరత్తు చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more