పట్టపగలు.. అందరూ చూస్తుండగానే నాలుగు రోడ్ల కూడలిలో ఓ దుండగుడు మహిళకు పాయింట్ బ్లాక్ లో తుపాకి గురిపెట్టి ఆమె మెడలోని మంగళసూత్రాన్ని నిలువుదోపిడీ చేశాడు. మహిళ ప్రతిఘటించే ప్రయత్నం చేసేందుకు అవకాశమే లేకుండా తుపాకీతో కాల్చేస్తానని బెదిరించి మరీ అమె మెడలోని బంగారు గొలుసును లాక్కుని దర్జాగా చెక్కేశాడు. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ నగరంలో ఈ దౌర్జన్య ఘటన చోటుచేసుకుంది. రోడ్డుకు నలువైపులా నలుగురు వున్నా.. ఏమీ చేయలేని నిస్సహాస్థితిలో ఉండిపోయారు. ఎదురుగా వచ్చిన అటో క్యారియర్ డ్రైవర్ దిగే ప్రయత్నం చేసినా.. తుపాకీని చూసి వెనుకంజవేశారు.
ఘటన వివరాల్లోకి వెళ్తే.. ఓ మహిళ తన కొడుకును ట్యూషన్ సెంటర్ లో విడిచిపెట్టేందుకు స్కూటీపై వెళ్తుంది. అయితే ఆ వీధి మొత్తం పూర్తిగా నిర్మానుష్యంగా వుంది. దీంతో అప్పటికే అక్కడ మాటు వేసిన చైన్ స్నాచర్స్.. మహిళను గమనించారు. వెంటనే తమ బైక్ ను స్టార్ చేసి అమె కంటే ముందుగా వెళ్లి ఆ వీధి చివరన వున్న నాలుగు రోడ్ల కూడలి వద్ద.. రహదారికి ఓ వైపుగా మాటు వేసి తమ బైక్ ను నిలిపారు. మహిళ తన కోడుకుతో పాటు అక్కడికి చేరుకోగానే.. ఇద్దరిలో ఓ దుండగుడు బైక్ పైనుంచే అమె మెడలోని బంగారు గోలుసును లాగాడు.
ఈ క్రమంలో అమె బైక్ ముందుకు వెళ్లగా కిందపడిపోతూ బ్యాలెన్స్ చేసుకున్న దుండగుడ్ని.. మహిళ కొడుకు ప్రతిఘటించే ప్రయత్నం చేశాడు. దీంతో వెంటనే తుపాకీని పాయింట్ బ్లాక్ లో బెదిరించి తాపీగా మెడలోని బంగారు గొలుసును తెంపుకొని, దర్జాగా నడుచుకుంటూ వెళ్లి, బైక్ ఎక్కి అక్కడినుంచి చెక్కేశాడు. మహిళపై దాడికి పాల్పడిన సమయంలో అక్కడ ఎవరూ లేరనుకునేరు. పలువురు పాదచారులు, ఆటోలు, వాహనదారులు ఉన్నారు. అయినా దుండగుడు గొలుసు చోరీ చేసుకొనిపోయాడు. సీసీ టీవీ కెమెరాలో దశ్యాలు రికార్డు కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఘటనపై స్పందించిన పోలీసులు నిందితులను త్వరలోనే పటుకుంటామని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more