chain snatching in gwalior cctv footage goes viral పట్టపగలు.. ప్రధాన కూడలిలో.. మహిళను తుపాకీలో బెదిరించి..

Two bike borne miscreants snatch chain from a woman in gwalior

chain snatching in gwalior, chain snatching video, gwalior chain snatching video, chain snatching cctv footage, woman robbed at gun point in gwalior, viral video, chain snatching cctv video, two bike borne miscreants, Chain snatchers, woman, Gun point, gold chain, CCTV footage, Gwalior, Madhya pradesh, crime news

Two bike-borne miscreants snatch chain from a woman in Gwalior, in broad daylight. After the CCTV footage goes viral the police reacted and said.. the woman was on her way to drop her son at the tuitions when two unknown persons snatched her chain. We have CCTV footage and will arrest them soon.

ITEMVIDEOS: పట్టపగలు.. ప్రధాన కూడలిలో.. మహిళను తుపాకీలో బెదిరించి..

Posted: 08/27/2021 12:17 PM IST
Two bike borne miscreants snatch chain from a woman in gwalior

పట్టపగలు.. అందరూ చూస్తుండగానే నాలుగు రోడ్ల కూడలిలో ఓ దుండగుడు మహిళకు పాయింట్ బ్లాక్ లో తుపాకి గురిపెట్టి ఆమె మెడలోని మంగళసూత్రాన్ని నిలువుదోపిడీ చేశాడు. మహిళ ప్రతిఘటించే ప్రయత్నం చేసేందుకు అవకాశమే లేకుండా తుపాకీతో కాల్చేస్తానని బెదిరించి మరీ అమె మెడలోని బంగారు గొలుసును లాక్కుని దర్జాగా చెక్కేశాడు. మధ్యప్రదేశ్‌ లోని గ్వాలియర్ నగరంలో ఈ దౌర్జన్య ఘటన చోటుచేసుకుంది. రోడ్డుకు నలువైపులా నలుగురు వున్నా.. ఏమీ చేయలేని నిస్సహాస్థితిలో ఉండిపోయారు. ఎదురుగా వచ్చిన అటో క్యారియర్ డ్రైవర్ దిగే ప్రయత్నం చేసినా.. తుపాకీని చూసి వెనుకంజవేశారు.

ఘటన వివరాల్లోకి వెళ్తే.. ఓ మహిళ తన కొడుకును ట్యూషన్ సెంటర్ లో విడిచిపెట్టేందుకు స్కూటీపై వెళ్తుంది. అయితే ఆ వీధి మొత్తం పూర్తిగా నిర్మానుష్యంగా వుంది. దీంతో అప్పటికే అక్కడ మాటు వేసిన చైన్ స్నాచర్స్.. మహిళను గమనించారు. వెంటనే తమ బైక్ ను స్టార్ చేసి అమె కంటే ముందుగా వెళ్లి ఆ వీధి చివరన వున్న నాలుగు రోడ్ల కూడలి వద్ద.. రహదారికి ఓ వైపుగా మాటు వేసి తమ బైక్ ను నిలిపారు. మ‌హిళ‌ తన కోడుకుతో పాటు అక్కడికి చేరుకోగానే.. ఇద్దరిలో ఓ దుండగుడు బైక్ పైనుంచే అమె మెడలోని బంగారు గోలుసును లాగాడు.

ఈ క్రమంలో అమె బైక్ ముందుకు వెళ్లగా కిందపడిపోతూ బ్యాలెన్స్ చేసుకున్న దుండగుడ్ని.. మహిళ కొడుకు ప్రతిఘటించే ప్రయత్నం చేశాడు. దీంతో వెంటనే తుపాకీని పాయింట్ బ్లాక్ లో బెదిరించి తాపీగా మెడలోని బంగారు గొలుసును తెంపుకొని, దర్జాగా నడుచుకుంటూ వెళ్లి, బైక్‌ ఎక్కి అక్కడినుంచి చెక్కేశాడు. మహిళపై దాడికి పాల్పడిన సమయంలో అక్కడ ఎవరూ లేరనుకునేరు. పలువురు పాదచారులు, ఆటోలు, వాహనదారులు ఉన్నారు. అయినా దుండగుడు గొలుసు చోరీ చేసుకొనిపోయాడు. సీసీ టీవీ కెమెరాలో దశ్యాలు రికార్డు కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఘటనపై స్పందించిన పోలీసులు నిందితులను త్వరలోనే పటుకుంటామని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles