అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. వాషింగ్టన్ డిసీలో ఓ గుర్తు తెలియని వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని ఎదురు కాల్పులు జరపగా సదరు దుండగుడు మరణించాడు. తూర్పు వాషింగ్టన్లోని ఫిన్లీలో బుధవారం తెల్లవారు జామున ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం ట్రై సిటీస్ లోని జిప్స్ రెస్టారెంట్ మాజీ యజమాని అయిన ఇమిల్ బాబి జ్లాటిచ్ జూనియర్ మృతదేశం.. ఫెన్లీలోని అగ్నికి ఆహుతవుతున్న ఇంట్లో కనుగోన్నామని చెప్పారు.
అయితే ఇతడ్ని ఆయన కుమారుడే చంపాడని పోలీసులు నిర్థారణకు వచ్చారు. తన తండ్రితో పాటు తల్లిని కూడా చంపిన కుమారుడు.. వారికి మద్దుతు పలికిన పోరుగింటి వ్యక్తిని కూడా తుపాకీతో కాల్చి చంపేశాడని పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల్లో మరణించిన ముగ్గురు అతడి తల్లిదండ్రులతో పాటు పక్కింటి వ్యక్తి వున్నారని తెలిపారు. వారిని కాల్చిచంపిన తరువాత రగలిపోయిన దుండగుడు వారి ఇళ్లను కూడా తగులబెట్టాడు. కాగా ఈ కాల్పులకు తెగబడిన దుండగుడు ఓ వాహనంలోవచ్చి కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని జరిపిన ఎదురు కాల్పుల్లో దుండగుడు కూడా మృతి చెందాడు. అనుమానితుడు ఉపయోగించిన ట్రక్కు పశ్చిమ రిచ్ ల్యాండ్ లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కెన్నెవిక్ పోలీస్ కెప్టెన్ ఆరోన్ క్లెమ్ మాట్లాడుతు..దుండగుడు వాహనం లోపల నుంచే కాల్పులు జరిపాడని తెలిపారు. తాము జరిపిన కాల్పుల్లో నిందితుడు మరణించాడని.. నిందితుడు ఉపయోగించిన ట్రక్కులో పేలుడు పదార్ధాలున్నాయని వెల్లడించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టామని పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more