కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తన సోంత నియోజకవర్గంలో తొలిసారిగా పర్యటిస్తున్న కేంద్రమంత్రి పశుపతి పరాస్ కు పరాభవం ఎదురైంది. లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) చీలిక నేత పశుపతి పరాస్.. ఇటీవల కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం కేంద్రమంత్రి పదవిని కట్టబెట్టిన విషయం తెలిసిందే. అయితే కేంద్రమంత్రి హోదాలో తొలిసారిగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న బిహార్ రాష్ట్రంలోని హాజీపూర్ లోక్ సభ నియోజకవర్గానికి ఆయన వచ్చారు. ఈ క్రమంలో ఓ మహిళ ఆయనపై సిరాతో (ఇంకుతో) దాడి చేసింది.
హాజీపూర్ చేరుకున్న మంత్రి ఆయన అనుచర వర్గం ఘనస్వాగతం పలికింది. కాగా ఆయన వ్యతిరేక వర్గం మాత్రం అడుగడుగునా ఆయన నిరసన తెలిపింది. రాం విలాస్ పాశ్వాన్ తనయుడైన చిరాగ్ పాశ్వాన్ కు బలమైన అనుచరగణం ఆయనను ప్రతీ చోటా అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో చిరాగ్ పాశ్వాన్ మద్దతురాలు అయిన మహిళ పశుపతి పరాస్ పై ఇంకు చల్లింది. దీంతో ఆయన ధరించిన కుర్తాపై ఇంకు మరకలు పడ్డాయి. కాసేపటి తర్వాత మంత్రి తన దుస్తులు మార్చుకున్న ఆయనకు నియోజకవర్గంలో నిరసనల మధ్య యథావిధిగా తన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
లోక్ జనశక్తి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడైన రాం విలాస్ పాశ్వాన్ చిన్న తమ్ముడైన పశుపతి పరాస్.. తన సోదరుడు పార్టీ స్థాపించిన క్రమంలో అడుగడుగునా అండగా నిలిచారు. అయితే రాం విలాస్ మరణం తరువాత మారిన పరిణామాల నేపథ్యంలో పార్టీ బాధ్యతలు ఆయన తనయుడు చిరాగ్ పాశ్వాన్ అందుకన్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల పార్టీలో తిరుగుబాటుకు నాయకత్వం వహించిన పరాస్.. ఎంపీ చిరాగ్ పాశ్వాన్ను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించి పార్టీకి తాను అధ్యక్షుడయ్యారు. ఆ తర్వాత ఆయనకు కేంద్ర కేబినెట్ లో చోటు దక్కింది కానీ సోంత నియోజకవర్గంలో మాత్రం నిరసన ఎదురైంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more