కరోనా మహమ్మారి నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించిన ప్రముఖ సినీనటి పాయల్ రాజ్ పుత్ పై పెద్దపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సెలబ్రిటీగా కొనసాగుతున్న ఈమె కొవిడ్ మహమ్మారి విజృంభణ నేపథ్యంలో జారీ చేసిన నిబంధనలు ఉల్లంఘించారని అమెపై కేసు నమోదైంది. పెద్దపల్లి జిల్లాలో ఓ ప్రముఖ సంస్థ తరపున అమె హాజరై.. షాపింగ్ మాల్ ప్రారంభించారంటూ పెద్దపల్లి జూనియర్ సివిల్ కోర్టులో ఈ నెల 12న పిటిషన్ దాఖలైంది. పరిశీలించిన జడ్జి కేసు నమోదు చేసి విచారణ జరపాలని పోలీసులను ఆదేశించారు.
వివరాలలోకి వెళితే... రాష్ట్రంలో కోవిడ్ నిబంధనలను అమలులో వున్న తరుణంలో నటి పాయల్ రాజ్ పుత్ వాటిని ఉల్లంఘనకు పాల్పడి. జూలై నెల 11న పెద్దపల్లిలో షాపింగ్ మాల్ ప్రారంభించారు. మాల్ ప్రారంభోత్సవానికి హాజరైన ఆమె కరోనా నిబంధనలు ఏమాత్రం పాటించలేదని పెద్దపల్లి పట్టణానికి చెందిన బొంకూరి సంతోష్ బాబ్జీ తరపున ఆయన న్యాయవాది డొంకెన రవి న్యాయస్థానంలో దాఖలు చేసిన పిర్యదులో పిర్యాదిదారు పేర్కోన్నారు. ఆమెతోపాటు షాపింగ్ మాల్ యాజమాన్యం కూడా మాస్కులు ధరించలేదని పేర్కోన్నారు,
నటి పాయల్ రాజ్ పుత్ ను అహ్వానించిన మాల్ యాజమాన్యం ఈ విషయాన్ని స్థానిక దినపత్రికలతో పాటు ప్రచార సాధనాల ధ్వారా కూడా ప్రచారం చేయించారని, దీంతో అనేక మంది స్థానికులు నటి పాయల్ ను చూసేందుక అధిక సంఖ్యలో వచ్చారని కూడా పిర్యాదులో పేర్కోన్నారు. దీంతో మాల్ ప్రారంభోత్సవం సందర్భంగా భౌతిక దూరాన్ని గాలికి వదిలేశారని పాయల్ రాజ్పుత్, షాపింగ్ మాల్ యజమాని వెంకటేశ్వర్లు, ఆయన భార్యపై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు 20 రోజుల క్రితమే వారిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. అయితే, తాజాగా కోర్టు ఆదేశాలతో విషయం వెలుగులోకి వచ్చింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more