అదృష్టం రాసిపెట్టి వుంటే అది పాతాళంలో వున్నా.. సరైన సమయంలో వచ్చి తగులుతుందని పెద్దలు అంటారు. అయితే ఎలా వచ్చి తగులుతుందన్ని మాత్రం చెప్పడం కష్టం. కొందరికి లాటరీ రూపంలో.. మరికోందరికి వజ్రాల రూపంలో.. ఇంకోందరికి లంకెబిందెల రూపంలో ఇలా ఏదో ఒక మార్గంలో మాత్రం వచ్చి చేరడం ఖాయం. ఇక్కడ తాజాగా ఓ వ్యక్తికి మరో రూపంలో అదృష్టం తలుపుతట్టింది. ఆన్ లైన్ లో పాత రిఫ్రిజిరేటర్ను కొనుగోలు చేసిన ఈ వ్యక్తికి ఫ్రిడ్జ్ కింద ఏకంగా రూ. 96 లక్షల నగదు (1.3లక్షల డాలర్లు) కనిపించింది. ఈ ఘటన దక్షిణ కొరియాలో వెలుగుచూసింది.
దక్షిణ కొరియాలోని జెజు ఐలాండ్ కు చెందిన అదృష్టవంతుడు ఓ పాత ఫ్రిడ్జ్ కొనాలని ఆన్ లైన్ వేదికగా ఎంచుకుని దానిని అర్డర్ చేశాడు. అన్ లైన్ ద్వారా కొనుగోలు చేసిన ఈ పాత ఫ్రిడ్జ్ దాదాపు మూడు రోజుల తరువాత అతని ఇంటికి డెలివరీ అందించారు వర్తకులు. అయితే దానిని తన ఇంట్లో ఏర్పాటు చుసుకునే క్రమంలో ఆయన ప్రిడ్జ్ ను శుభ్రం చేస్తుండగా, దాని కింద భారీ మొత్తంలో నగదు దాచి ఉంచడం గమనించాడు. రిఫ్రిజిరేటర్ కింద అంత నగదు ఎలా ఉందనే విషయం అంతుబట్టలేదు. దీంతో ఆయన పోలీసులకు పిర్యాదు చేసి.. తనకు దొరికిన డబ్బును అందజేసి విషయాన్ని చెప్పాడు.
నగదు ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ షీట్స్లో ప్యాక్ చేసి ఫ్రిడ్జ్ కింద ఉంచారు. ఈ డబ్బును సదరు వ్యక్తి పోలీసులకు అప్పగించాడు. ఇంత డబ్బు ఎందుకు ఇక్కడ ఉంచారనే దానిపై ఫ్రిడ్జ్ విక్రేతను గుర్తించేందుకు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు. ఇక దక్షిణ కొరియా చట్టాల ప్రకారం ఈ డబ్బు ఎవరిదనేది గుర్తించని పక్షంలో దాన్ని గుర్తించిన వ్యక్తికే అది చెందుతుంది. అదే జరిగితే రిఫ్రిజిరేటర్ యజమాని మొత్తం నగదులో 22 శాతం పన్నులు చెల్లించగా మిగిలిన మొత్తం సొంతం చేసుకోవచ్చు. డబ్బు వేరొకరిదని తేలినా రిఫ్రిజిరేటర్ ఓనర్కు కొంతమొత్తం పరిహారం లభిస్తుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more