మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ప్రధాన నిందితుడు సునీల్ యాదవ్ ను అరెస్టు చేసిన సీబిఐ.. మరో కోణంలోనూ విచారణను కోనసాగిస్తోంది. ఈ క్రమంలో తమ విచారణ వేగం పెంచింది. వైఎస్ కుటుంబం సమీప బంధువులు, సన్నిహితులపైన దృష్టి సారించారు అధికారులు. పులివెందుల ఆర్ అండ్ బీ గెస్ట్ హౌజ్ లో పలువురిని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ పలువరు క్రీయాశీలక వ్యక్తులను విచారించనుందని సమాచారం. కడప ఎంపీ అవినాష్ రెడ్డికి అత్యంత సన్నిహితుడ్ని ఇవాళ సీబిఐ అధికారులు విచారణకు పిలిచారని సమాచారం.
వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి హాజరయ్యారు. ఆయనతో పాటు పులివెందుల క్యాంప్ ఆఫీస్ లో పనిచేసే రఘునాథరెడ్డి కూడా వెళ్లారు. గతంలోనూ సిట్, సీబీఐ బృందాలు శివశంకర్ రెడ్డిని విచారించాయి. ఇక వైఎస్సార్ ఆర్కిటెక్చర్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం (ఏఎఫ్యూ) రిజిస్ట్రార్, ఈసీ గంగిరెడ్డి బంధువు సురేంద్రనాథ్రెడ్డిని ప్రశ్నించింది. వివేకానందరెడ్డి రక్తపు మడుగులో పడి వుంటే సాధారణ మరణమని ఎలా అనుకున్నారని అధికారులు ప్రశ్నించగా.. కంగారులో సరిగా గుర్తించలేకపోయినట్టు ఆయన బదులిచ్చినట్టు సమాచారం.
అలాగే, సీబీఐ కస్టడీలో ఉన్న సునీల్ కుమార్ యాదవ్, మాజీ డ్రైవర్ దస్తగిరిని కారులో ఎక్కించుకుని వివేకా ఇంటికి తీసుకెళ్లిన అధికారులు అక్కడి ప్రాంతాలను మరోమారు క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆర్అండ్బీ గెస్ట్హౌస్కు తీసుకెళ్లి మరోమారు ప్రశ్నించారు. వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డి, పులివెందులకు చెందిన చెప్పుల దుకాణం యజమాని మున్నాను కూడా ప్రశ్నించారు. మున్నా బ్యాంకు ఖాతాలు పరిశీలించారు. వివేకాకు అత్యంత సన్నిహితుడైన ఎర్ర గంగిరెడ్డి, వివేకానందరెడ్డి పొలం పనులు చూసుకునే జగదీశ్వర్రెడ్డి తమ్ముడు ఉమాశంకర్రెడ్డి, ఓ యూట్యూబ్ చానల్ విలేకరి, సునీల్ కుమార్ బంధువు భరత్ యాదవ్ను సీబీఐ అధికారులు విచారించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more