కృష్ణా జలవివాద పిటిషన్ల విచారణ సందర్భంగా తెలంగాణ అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ప్రసాద్ పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మాసనానికి ఉద్దేశాలు ఆపాదించడం మంచిదికాదని అసహనం వ్యక్తం చేశారు. పిటిషన్ ను ఫలానా ధర్మాసనమే విచారించాలని కోరుకోవడం సరి కాదన్నారు. ఏ బెంచ్ విచారించాలో తానే నిర్ణయిస్తానని, కావాలంటే పిటిషన్ ను వెనక్కు తీసుకోవాలని అన్నారు. దీంతో మధ్యంతర పిటిషన్ ను వెనక్కు తీసుకుంటానని కోర్టుకు ఏజీ తెలిపారు. ఇటు ఏపీ పిటిషనర్ల తరఫు న్యాయవాది వెంకటరమణపైనా సీజే హిమా కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కృష్ణా బేసిన్ లో విద్యుదుత్పత్తి చేయాలంటూ గత నెల 28న తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోపై ఏపీలోని కృష్ణా జిల్లా రైతులు తెలంగాణ హైకోర్టులో నిన్న పిటిషన్ వేశారు. అయితే, ఆ పిటిషన్ ను జస్టిస్ రామచంద్రరావు నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు చేపట్టింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఏజీ ప్రసాద్.. సీజే నేతృత్వంలోని ధర్మాసనమే విచారణ చేయాలంటూ ఇవ్వాళ మధ్యంతర పిటిషన్ ను దాఖలు చేశారు. నదీ జలాల అంశాలకు సంబంధించి రోస్టర్ ప్రకారం సీజే నేతృత్వంలోని ధర్మాసనమే విచారణ జరపాల్సి ఉంటుందని పిటిషన్ లో పేర్కొన్నారు.
ఇప్పటికే ఈ విషయాన్ని సీజే దృష్టికి తీసుకెళ్లామని, జస్టిస్ రామచంద్రరావు బెంచ్ కు ఈ విషయాన్ని తెలియజేయాల్సిందిగా సీజే చెప్పారని అన్నారు. జస్టిస్ రామచంద్రరావు ఏపీకి చెందిన వ్యక్తి కాబట్టి.. వేరే ధర్మాసనానికి విచారణను బదిలీ చేయాలని కోరారు. దీనిపై జస్టిస్ రామచంద్రరావు అసహనం వ్యక్తం చేశారు. విచారణ చేపట్టాక అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. ఏజీ తీరు దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఈ విషయంపై సీజే నుంచి స్పష్టత వచ్చాక నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. దీంతో సీజే కూడా ఇరు వర్గాల న్యాయవాదులపై ఫైర్ అయ్యారు. ఇరు వైపుల న్యాయవాదులు కేసులో గందరగోళాన్ని సృష్టిస్తున్నారని మండిపడ్డారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more