భారతీయులకు అందుబాటులోకి మరో కరోనా వాక్సీన్ వచ్చేస్తోంది. కరోనా మహమ్మారి నుంచి కపాడటంలో ఏకంగా 90శాతం సామర్థ్యం వున్న వాక్సీన్ అందుబాటులోకి రానుంది. ఇటీవల భారత ఔషధ నియంత్రణ మండలి నుంచి అత్యవసర అనుమతులు పోందిన మోడెర్నా వ్యాక్సిన్ ను ఈ నెలలోనే అందుబాటులోకి తీసుకురానుంది సిప్లా కంపెనీ. ఇప్పటికే అన్ని ఏర్పాటు పూర్తి చేసుకుని సిద్దంగా వున్న మోడర్నా వాక్సీన్ ను జులై 15 నుంచి ప్రభుత్వాసుపత్రుల్లో అందుబాటులోకి రానున్నాయి.
భారత్ లో మోడెర్నా వ్యాక్సిన్ల పంపిణీ కోసం ప్రముఖ ఫార్మా సంస్థ సిప్లా ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ప్రస్తుతం వ్యాక్సిన్ డోసులను సిప్లా దిగుమతి చేసుకుంటోంది. వచ్చే వారం నుంచి వీటిని దేశంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు కేటాయించనున్నారు. ఇప్పటికే దిగుమతులు అన్ని ఏర్పాట్లు జరగడంతో వాటిని డీజీసిఐ అదేశాల మేరకు తొలుత వంద మంది ఇవ్వనున్నారు. వీరి అరోగ్యాన్ని కూడా పరీక్షిస్తున్నారు. ఆ తరువాత డీజీసిఐ అదేశాల మేరకు దేశంలోని వివిధ రాష్ట్రాలకు ఈ టీకాలు పరఫరా అవుతున్నాయి.
ఈ క్రమంలో తొలి వంద మంది ఆరోగ్యానికి సంబంధించిన ఏ రోజుకారోజు నివేదికను కూడా భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ)కి సిప్లా సమర్పించేందుకు కూడా సిప్లా కంపెనీ ప్రతినిధులు అన్ని ఏర్పాట్లను సిద్దం చేశారు. ఈ షరతుపైనే మోడెర్నా వ్యాక్సిన్ కు భారత్ లో అత్యవసర వినియోగ అనుమతి ఇచ్చారు. ఎంఆర్ఎన్ఏ సాంకేతికత ఆధారంగా అభివృద్ధి చేసిన మోడెర్నా కరోనా వ్యాక్సిన్ సమర్థత 90 శాతానికి పైనే ఉండడం విశేషం. అమెరికా, యూరప్ దేశాల్లో మోడెర్నా టీకాల పంపిణీ ఎప్పటినుంచో జరుగుతోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more