రాత్రికి రాత్రి కుబేరులు కావాలంటే.. ఏం చేయాలి.. అదృష్టం వుంటే తప్ప సాధ్యం కాదు. అయితే అలాంటి అదృష్టమే ఓ కేరళ టాక్సీ డ్రైవర్ ను వరించింది. కరోనా కష్టకాలంలో దేవుడు వరమిచ్చినట్టుగా.. ఒక్కసారిగా అతని కష్టాలన్నీ తీరిపోయి.. సుఖంగా ఉండేందుకు మార్గం లభించింది. ఇన్నాళ్లు ఎన్నో కష్టాలు పడుతూ.. తన కుటుంబాన్ని పోషించలేక అవస్థలు పడిన ఆ డ్రైవర్ కష్టాల కడలిని వదిలి.. సంతోష సాగరంలో అడుగుపెడుతున్నాడు. అదేంటి అంతలా ఉపోద్ఘాతం ఇస్తున్నారని అంటారా.. ఔనండీ తప్పడు మరీ..
ఇన్నాళ్లు యూనైటెడ్ ఆరబ్ ఎమిరేట్స్ లో పనిచేస్తున్న దుబాయ్ వాసులకు అదృష్టం బాగానే వుందని విన్నాం. అయితే వారిలో చాలా మందికి కోట్ల రూపాయల లాటరీ ఫ్రైజ్ మనీ వచ్చింది. అయితే ఇందులో ఎవరికీ రెండెకలు దాటిన ప్రైజ్ మనీ మాత్రం రాలేదు. వచ్చినా అది చాలా అరుదు. కానీ దుబాయ్ లో టాక్సీ డ్రైవర్ గా పనిచేస్తున్న ఓ కేరళవాసికి మాత్రం ఏకంగా రూ. 40 కోట్ల రూపాయలు ప్రైజ్ మనీగా వచ్చింది. దీంతో అబుదాబిలో 2008 నుంచి టాక్సీ డ్రైవర్ గా పనిచేస్తున్న కేరళ వ్యక్తి ఒకరు రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారిపోయాడు.
ఇటీవల అతడు కొనుగోలు చేసిన లాటరీ టికెట్కు రూ. 40 కోట్ల జాక్ పాట్ తగిలింది. తొలుత ఈ విషయాన్ని నమ్మలేని అతడు ఆ తర్వాత తనకు దక్కిన అదృష్టాన్ని చూసి మురిసిపోతున్నాడు. టాక్సీ డ్రైవర్ అయిన 37 ఏళ్ల రెంజిత్ సోమరాజన్ మూడేళ్లుగా లాటరీ టికెట్లు కొంటున్నాడు. గత నెల 29న తన సహచరులైన 9 మందితో కలిసి తలా 100 దిర్హమ్లు వేసుకుని తన పేరుపై లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. తాజాగా నిర్వహించిన డ్రాలో ఆ టికెట్కు 20 మిలియన్ దిర్హమ్ లు (దాదాపు 40 కోట్లు) తగిలాయి. జాక్పాట్ తగిలిన విషయం తెలిసి ఉప్పొంగిపోతున్న సోమరాజన్ మాట్లాడుతూ.. తన సహచరుల్లో భారత్, పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్ వ్యక్తులు ఉన్నారని, వచ్చే మొత్తాన్ని అందరం సమానంగా పంచుకుంటామని తెలిపాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more