పిడుగు శబ్దం వింటేనే శరీరమంతా వణుకు పుడుతోంది.. మన పెద్దలు అందుకే పిల్లలు ఆ శబ్ద విస్పోటనంతో పిల్లలు భయపడకుండా, ఎలాంటి అనారోగ్యాలకు గురికాకుండా వుండేందుకు అర్జునా, పాల్గునా అంటూ పెద్దగా ఉచ్చిరించి ఆ దేవుడిని ప్రార్థిస్తారు. దీంతో పిల్లల దృష్టి విస్పోటన శబ్దం నుంచి తమ తల్లిదండ్రుల వ్యాఖ్యలపైకి మరుతుందని చే్స్తుంటారు. ఇంట్లో ఒంటరిగా వున్న పెద్దలు కూడా పిడుగులు పడే సమయంలో దేవుడిని ప్రార్థిస్తూ ఎవరికీ ఏమీ కాకుండా భూమిలోకి చోచ్చుకెళ్లాలని కోరుకుంటారు.
ఇక అలాంటి పిడుగు మనకు సమీపంలో పడితేనే ఎంతో హైరానా పడిపోతాం. అదే మన ముందు ఓ యాభై మీటర్ల దూరంలో పడితే.. ఇంకేమైనా వుందా.? ఒక్కసారి ఉల్లిక్కిపడతాం. అయితే అలాంటి పరిస్థితే ఎదురైంది కార్ల్ హోబి అనే వ్యక్తికి. తాను ప్రయాణిస్తున్న కారుకు ఎదుటనున్న కారుపై పిడుగు పడింది. ఒక్కసారగా కన్నుల ముందు అంతా తెల్లగా మారి.. వెంటనే చీకటిగా మారింది. తేరుకుని చూసే లోపు ఎదుట కారుపై పిడుగు పడింది. అయితే కారులోని వ్యక్తులపై నుంచి కాకుండా కారు టైర్ల నుంచి భూమిలోకి చోచ్చుకెళ్లింది పిడుగు.
దీంతో ఆ కారు వెనకాలే వెళ్తున్న కార్ల్ హోబి లైవ్ లో పిడుగు పడిన ఘటన చూసి చెమటలు పట్టాయి. వెంటనే తేరుకుని కారు వద్దకు చేరుకుని కారులోని వ్యక్తులకు ఎలాంటి ప్రాణాపాయం జరగలేదని అందరూ తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నాడు. ఈ ఘటన అమెరికాలోని కాన్సస్ లో చోటుచేసుకుంది. ఈ సమయంలో కారులో ఇద్దరు దంపతులు, మూడేళ్ల చిన్నారి, ఏడాదిన్నర చిన్నారితో పాటు ఆరు నెలల చిన్నారి వున్నారు. దంపతులు ముగ్గురు పిల్లలు కలిసి కారులో ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పిడుగు విస్పోటన శబ్దానికి ఆ ఐదుగురు వణికిపోయారు. ఎలాంటి ప్రాణపాయం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన జూన్ 25న చోటు చేసుకోగా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more