దళితులను మరోమారు మోసం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని బీజేపి నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరికీ అందే పథకాలు కాకుండా దళితవర్గాలకు మాత్రమే అందుతున్న పథకాలేమిటో రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ పెద్దలు చెప్పాలని ఆయన ప్రశ్నించారు. మరోమారు వంచించేందుకు తెరపైకి దళిత ఎంపవర్ మెంట్ పేరుతో యాత్రలు కొనసాగుతున్నాయని ఆయన విమర్శించారు. హుజూరబాద్ ఎన్నికల నేపథ్యంలో ఈ కొత్త నాటకానికి రాష్ట్ర ముఖ్యమంత్రి తెరలేపారని అన్నారు. ఇందులో ఆర్భాటమే కానీ పసలేదని తేల్చిచెప్పారు.
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈటల మాట్లాడారు. ఏ జాతి వల్ల పదవి దక్కిందో వారిని అగౌరవ పరచొద్దని పరోక్షంగా సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ నిజంగా దళితుల అభ్యున్నతిని కాంక్షించేవారే అయితే తక్షణం తాను చేసిన ఎన్నికల వాగ్ధానం ప్రకారం ముఖ్యమంత్రి పదవిని ఎస్సీలకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా ఎస్సీలకు కేటాయించే నిధులు ఇతర పథకాలకు మళ్లిస్తున్నారన్నారు. రెవెన్యూ సంస్కరణల ద్వారా పెద్దల భూములను దశాబ్దాలుగా సాగుచేసిన దళితులకు నష్టమే చేకూరిందని ఆయన అవేదన వ్యక్తం చేశారు.
తెల్ల కాగితంపై రాసుకుని కొనుగోలు చేసిన భూములు మళ్లీ దొరలకే వెళ్లాయిని అరోపించారు. ఎప్పుడో కొనుగోలు చేసిన భూములకు పాసు పుస్తకాలు రాకపోవడంతో దళితవర్గాల వారు అనేక ఇబ్బంది పడ్డారని అన్నారు. చిత్తశుద్ధి ఉంటే ఈ ఏడేళ్లలో ఎస్సీలకు ఎంతో చేసిండ్రో చెప్పాలని ప్రశ్నించారు. సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ కు మాత్రమే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పరిమితమయ్యాయి. టీఆర్ఎస్ నేతల వల్ల లబ్ధిపొందిన గుత్తేదారులు తప్ప రాష్ట్రంలో మిగతా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇంకా బాలారిష్టలకు గురవుతున్నాయని అరోపించారు. మంత్రులు, పార్టీ నేతలకు విలువ ఇచ్చే సంస్కారం టీఆర్ఎస్ లో లేదని అన్నారు. ఎన్నికలప్పుడు హామీలతో మభ్యపెట్టి గెలవడమే టీఆర్ఎస్ కు తెలుసునని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more