మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ అధికారుల నిర్వాకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమ రాష్ట్రం జాతీయ రికార్డును సాధించాలనే ఆసక్తి నేపథ్యంలో ఇతర ప్రభుత్వ పథకాల కోసం ధరఖాస్తు చేసుకున్న వ్యక్తులకు కూడా కరోనా టీకాను వేసినట్లు ధృవీకరించారు. ఇక వీరి నిర్లక్ష్యం ఎంతటి పరాకాష్టకు చేరిందంటే ఏకంగా 13 ఏళ్ల బాలుడికి కూడా కరోనా వాక్సీన్ ఇచ్చేసినట్టు అతని తండ్రి సెల్ ఫోన్ కు ఎస్ఎంఎస్ అందించడమే కాకుండా ఏకంగా ఆ పిల్లాడికి కరోనా వాక్సీన్ తీసుకున్నట్లుగా సర్ఠిఫికెట్ కూడా జారీ చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. గత సోమవారం రాత్రి 7.27 గంటలకు భోపాల్ లో నివాసం ఉంటున్న రజత్ దాంగ్రే ఫోన్ కు ఓ మెసేజ్ వచ్చింది. అందులోని సమాచారం ఏంటంటే... రజత్ కుమారుడు వేదాంత్ దాంగ్రేకు కరోనా టీకాను వేయడం జరిగింది. ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ నుంచి ఈ సమాచారం రాగానే రజత్ అవాక్కయ్యారు. ఇంతవరకూ దేశంలో 18 ఏళ్ల లోపు వారికి వ్యాక్సిన్ వేసేందుకు అనుమతులే లేకపోగా, 13 ఏళ్ల తన కుమారుడికి ఎప్పుడు, ఎక్కడ, ఎవరు వ్యాక్సిన్ వేశారా? అని అయోమయంలో పడ్డాడు.
ప్రభుత్వం నుంచి వచ్చిన మెసేజ్ లో వేదాంత్ వయసు 56 సంవత్సరాలుగా పేర్కొనడం గమనార్హం. ఈ సమాచారాన్ని చూసి తాను దిగ్భ్రాంతికి గురయ్యానని, వెంటనే అందులోని లింక్ ను ఓపెన్ చేసి చూడగా, వ్యాక్సిన్ వేసినట్టు సర్టిఫికెట్ కూడా వచ్చిందని రజత్ తెలిపారు. ఈ విషయమై తాను ఫిర్యాదు చేసేందుకు వెళ్లి విఫలం అయ్యానని, దివ్యాంగుడైన తన కుమారుడికి పెన్షన్ కోసం ఇటీవల మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లి, కొన్ని ధ్రువపత్రాలను ఇచ్చానని, వాటిని అధికారులు దుర్వినియోగం చేశారని ఆరోపించారు.
ఈ నెల 21న మధ్యప్రదేశ్, వ్యాక్సినేషన్ లో జాతీయ రికార్డును సృష్టిస్తూ, 17.42 లక్షల మందికి టీకాలను ఇచ్చామని చెప్పుకుంటున్నా.. ఇందులో ఎందరికి సక్రమంగా టీకాలను వేశారన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే చాలా మంది తాము టీకాలు తీసుకోకున్నా, తమ సెల్ ఫోన్లకు టీకా తీసుకున్నట్టు సమాచారం, ఆ వెంటనే వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ వస్తోందని ఆరోపించారు. దీంతో తమ పేరున టీకాలు తీసుకున్నట్లు సమాచారంతో తాము ఇక ఇప్పుడు ఎక్కడ టీకాలు తీసుకోవాలని వారు ప్రశ్నిస్తున్నారు.
ఇక అదే రోజున సాత్నా జిల్లాలో ఉండే చినేంద్ర పాండేకు ఐదు నిమిషాల వ్యవధిలో ముగ్గురికి టీకాలు వేసినట్టుగా మెసేజ్ లు వచ్చాయి. అయితే ఆ ముగ్గురు వ్యక్తులతో తను కు ఎలాంటి సంబంధం లేదని, వారెవరో కూడా తనకు తెలియదని అతను ఆరోపించారు. భోపాల్ లోనే ఉండే నుజహత్ సలీమ్ (46)కు ఎటువంటి పెన్షన్ రాకున్నా, ఆమె పెన్షనర్ అని ప్రూఫ్ చూపుతూ వ్యాక్సిన్ వేసినట్టుగా మెసేజ్ వచ్చింది. అమెను పెన్షనర్ కాకపోయినా అమె కరోనా టీకాకు పెన్షన్ తీసుకునే ధృవపత్రాన్ని జతచేయడం గమనార్హం.
ఇక ప్రేమ్ పాండ్యా అనే మరో వ్యక్తి తాను వాక్సీన్ తీసుకునేందుకు రిజిస్టర్ చేసుకున్నాడు. అయితే కొరత వుందన్న సమాచారంతో వేచిచూస్తుండగా, అతను కూడా వాక్సీన్ తీసుకున్నట్లు సమాచారం రావడంతో ఖంగుతిన్నాడు. తన పేరున తొలి డోసు తీసుకున్నట్లు వచ్చిందని అయితే తాను తీసుకోలేదని ప్రేమ్ పాండ్యా పేర్కోన్నారు. ఇలా మున్సిఫల్ స్థాయి నుంచి అన్ని స్థాయిల్లో అధికారులు తమ వద్దనున్న సమాచారాన్ని దుర్వినియోగం చేసి టీకాలు తీసుకున్నట్లు నమోదు చేశారని బాధితులు అరోపిస్తున్నారు. వీరే కాదు... ఇంకా చాలా మంది ఇటువంటి అనుభవాలనే ఎదుర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more