మహారాష్ట్రలోని అమరావతి నియోజక వర్గం నుంచి పార్లమెంటుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీ నవనీత్ కౌర్ కు గట్టి ఎదురుదెబ్బ తగలింది. అంతేకాదు అమె పార్లమెంటు సభ్యత్వం కూడా రసకందాయంలో పడింది. అమరావతి పార్లమెంటు నియోజకవర్గం నుంచి స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన ఎంపీ నవనీత్ కౌర్ కుల దృవీకరణ పత్రన్ని బాంబే హైకోర్టు రద్దు చేసింది. అనంతరం ఆమెకు రూ.2 లక్షల జరిమానా విధించింది. దీంతో అమకు ఊహించని పరిణామం ఎదురైంది. ఆమె ఎస్సీ కాదంటూ మంగళవారం బాంబే హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
విచారణ సందర్బంగా నవనీత్ కౌర్ ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాన్ని బాంబే హైకోర్టు రద్దు చేసింది. అనంతరం జస్టిస్ ఆర్డీ ధనుకా, విజి బిష్ట్ ల డివిజన్ బెంచ్ రూ.2 లక్షల జరిమానా కూడా విధించింది. ఈ జరిమానాను ఎంపీ మహారాష్ట్ర లీగల్ సర్వీస్ అథారిటీకి చెల్లించాలని ఆదేశించింది. నవనీత్ కౌర్ గత ఎన్నికల్లో మహారాష్ట్రలోని అమరావతి (ఎస్సీ రిజర్వ్) స్థానం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఈక్రమంలో నవనీత్ కౌర్ తాను ఎస్సీ అని పేర్కొంటూ తప్పుడు పత్రాలు సమర్పించారని శివసేన నేత ఆనంద్ రావ్ అడ్సల్ దాఖలు చేసిన పిటీషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ సంచలన తీర్పుని వెలువరించింది.
నవనీత్ కౌర్ ఎస్సీ కాదని తేల్చిన న్యాయస్థానం.. అమె కుల ధ్రువీకరణ రద్దు చేసింది. దీంతో అమె పార్లమెంటు సభ్యత్వానికి కూడా ఎసరు వచ్చే అవకాశాలు వున్నాయి. మహారాష్ట్రలోని అమరావతి పార్లమెంటు నియోజకవర్గం ఎస్సీ అభ్యర్థులకు రిజర్వు చేయబడింది. అయితే నవనీత్ కౌర్ ఎస్సీ కాదని న్యాయస్థానం తేల్చిన నేపథ్యంలో తన ఎంపీ పదవిని కోల్పోయే ప్రమాదం వచ్చింది. అయితే బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తాను దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రింకోర్టును ఆశ్రయిస్థానని ఎంపీ నవనీత్ కౌర్ తీర్పు అనంతరం తెలిపారు.
కాగా. గత మార్చిలో శివసేన ఎంపీ అరవింద్ సావంత్ తనను లోక్ సభ లాబీలో బెదిరించారని నవనీత్ కౌర్ ఆరోపించడం తెలిసిందే. పార్లమెంటులో మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే జైలుకు పంపిస్తామని ఎంపీ అరవింద్ సావంత్ తనను బెదిరించారని..శివసేన లెటర్ హెడ్ తో బెదిరింపు లెటర్స్ కూడా వస్తున్నాయని… ఫోన్ చేసి కూడా బెదిరిస్తున్నారని గతంతో నవనీత్ కౌర్ ఆరోపించారు. దీనిపై నవనీత్ కౌర్ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు కూడా ఫిర్యాదు చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more