కరోనా వైరస్ రెండో దశ అత్యంత వేగంగా విస్తరిస్తున్న తరుణంలోనూ రాష్ట్రంలో లాక్ డౌన్ విధించే అవసరమే లేదని బీరాలు పోయిన ప్రభుత్వం.. క్రమంగా కేసులు సంఖ్య అంతకంతకూ పెరుగుతూ మృతుల సంఖ్య కూడా పెరగడంతో కట్టడికి చర్యలు తీసుకుంది. ఇందులో బాగంగా గత్యంతరం లేక రాష్ట్రంలో అకస్మాత్తుగా గత నెల 12న లాక్ డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తొలుత వారం రోజులు ఆ తరువాత పది రోజుల పాటు కేవలం ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు సడలింపుతో లాక్ డౌన్ ప్రకటించగా రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభనకు కట్టడి పడింది. లాక్ డౌన్ ఫలితంగా రాష్ట్రంలో క్రమంగా కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి.
ఇక రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇచ్చిన నివేదిక మేరకు గత నెల 31 నుంచి ఈ నెల 9 వరకు ఉదయం పూట ఆరు గంటల నుంచి మధ్యహ్నాం ఒంటి గంట వరకు ఆ తరువాత మరో గంట ఇళ్లకు చేరుకునేందుకు సడలింపులు కల్పిస్తూ మరో పది రోజుల పాటు లాక్ డౌన్ ను పోడగించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో మరో రెండు రోజుల వ్యవధిలో రాష్ట్రంలో లాక్ డౌన్ ముగియనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో మంగళవారం భేటీ కానున్న మంత్రివర్గం లాక్ డౌన్ పోడగింపుపై నిర్ణయం తీసుకోనుంది. కాగా వైద్య అరోగ్యశాఖ అధికారులు కూడా రేపు తమ నివేదికను మంత్రివర్గానికి అందించనున్నారని సమాచారం. ఈ క్రమంలో రాష్ట్రంలో మరింత సమయాన్ని సడలించాలని పలువర్గాలకు చెందిన వారు కూడా కోరుతున్నారు.
అయితే వ్యాపారులు, ఇతరుల అభ్యర్థనలను కూడా పరిగణలోకి తీసుకోనున్న రాష్ట్ర ప్రభుత్వం.. కరోనా ఆంక్షలను మరింతగా సడలించాలని యోచిస్తోందని తెలుస్తోంది. కాగా కొందరు మాత్రం ప్రస్తుతం ఒంటిగంట వరకు సడలింపులు ఉండగా, దీనిని సాయంత్రం 5 గంటల వరకు పెంచాలని నిర్ణయం తీసుకోనుందని భావిస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం లాక్ డౌన్ స్థానంలో పూర్తిగా కర్ప్యూను అమల్లోకి తీసుకురావాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ ను ఎత్తివేసి.. సాయంకాలం ఏడు గంటల నుంచి తెల్లవారు జామూ ఆరు గంటల వరకు కర్ప్యూను అమల్లోకి తీసుకురావాలని, ఇక కర్య్పూను కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టుగా సమాచారం. అలాగే, ఆ సమయంలో రోడ్లపై ఉన్న వారు ఇళ్లకు చేరుకునేందుకు వీలుగా మరో గంట సమయం ఇవ్వాలని భావిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more