అప్పుడప్పుడు ప్రకృతిలోని పంచభూతాలు కూడా సామాన్యులను అదృష్టవంతులుగా చేస్తాయన్న వార్తలు వింటూవుంటాం. వర్షం కురిస్తే వజ్రాలు బయటపడటం, పొలం పనులు చేస్తున్న సమయంలో గుప్త నిధులు లభ్యం కావడం,, పాత ఇళ్లను మరలా నిర్మించే ప్రక్రియలోనూ పురాతణ నాణేలు లభించడం వింటూనే ఉన్నాం.. అయితే తాజాగా ఓ రైతు తన పొలంలో తవ్వకాలు జరుపుతున్న సమయంలో ఓ బంగారు విగ్రహం లభ్యమైంది. దీనిని ఆ రైతు మల్లన్న స్వామి విగ్రహంగా భావించి ఇంటికి తీసుకెళ్లి పూజలు నిర్వహిస్తున్నాడు.ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
విషయం బయటకు పొక్కడంతో అధికారుల దృష్టికి వెళ్ళింది. దీంతో వారు విచారణ చేపట్టి విగ్రహం స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణ ములుగు జిల్లా కన్నాయిగూడం మండలం ముప్పనపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బిల్ల నారాయణ అనే వ్యక్తి గుప్త నిధుల కోసం బుట్టాయిగూడెంకు చెందిన మరో వ్యక్తితో కలిసి తన పొలంలో తవ్వకాలు జరిపాడు. ఈ తవ్వకాల్లో 500 గ్రాముల బంగారు మల్లన్న దేవుడి విగ్రహం దొరికింది. దీంతో అతడు దానిని తీసుకోని ఇంటికి వెళ్లి పూజలు చేయడం ప్రారంభించాడు. అయితే నారాయణ పొలంలో జంతు బలి జరిగిన విషయం గ్రామస్థుల దృష్టికి వచ్చింది. వెంటనే నారాయణ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు గుప్త నిధుల తవ్విన ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం పోలీసులు పొలం యజమాని నారాయణ ఇంటికి వెళ్లి ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. పోలీసులకు బంగారం విగ్రహం కనిపించడంతో నారాయణను విచారించారు. దీంతో నారాయణ అసలు విషయం బయట పెట్టాడు. తనకు మే నెలలో తన పొలంలో మల్లన్న విగ్రహం ఉన్నట్లు కల వచ్చిందని.. అందుకనే మరో వ్యక్తి సహాయంతో మే 26 పొలంలో తవ్వకాలు జరిపానని చెప్పాడు. ఆ తవ్వకాల సమయంలో ఈ విగ్రహం దొరికిందని వివరించాడు. దీంతో విగ్రహాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నారాయణపై అతనికి సహకరించిన వ్యక్తిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more