కంటికి కనిపించని శత్రువుతో గత ఏడాదిన్నర కాలంగా యావత్ ప్రపంచం యుద్దం చేస్తోంది. అనేకానేకులు కరోనా వైరస్ మహమ్మారి ప్రభావానికి గురై కొలుకోగా, లకలాధి మంది మాత్రం అసువులు బాసారు. దీంతో అసలు కరోనా వైరస్ ఎలా వ్యాపిస్తుంది.. ఒకరి నుంచి ఒకరికి ఎలా చేరుతుందన్న విషయంపై అద్యయాలు ప్రారంభమయ్యాయి. అయితే ఇది అనేక మార్గాల్లో వేగంగా వ్యాపిస్తోందని మరీ ముఖ్యంగా ఒకరినుంచి మరొకరికి నోటి తుంపర్లు ద్వారా, ఒకరు మరోకరిని ముట్టుకోవడం ద్వారా వ్యాపిస్తోందని ప్రాథమికంగా పరిశోధనలు చేసిన అధ్యయానాలు తెలిపాయి.
కాగా కరోనా ఇప్పుడు గాల్లోనూ వేగంగా వ్యాపిస్తోందని పరిశోధనలు తెలిపాయి. అయితే కేవలం ముక్కు, నోటి ద్వారా మాత్రమే ఇన్నాళ్లు ఇది మనుషుల శరీరంలోకి ప్రవేశిస్తుందని అద్యయానాలు తెలుపగా, తాజాగా కరోనా మహమ్మారి కంటి ద్వారా కూడా సోకుతుందని అనేక అధ్యయనాల్లో తేలింది. కరోనావైరస్ కంటిద్వారా వ్యాపించడం ద్వారా కళ్లకు అత్యంత ప్రమాదకరమని తాజా అధ్యయనంలో తేలింది. గాలిలో వున్న కరోనా కణాలు కళ్ల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయని, అయితే ఇవి కళ్లలోని కణాలపై తీవ్ర ప్రభావాన్ని చూపి కంటి చూపును కూడా కోల్పోయేలా చేస్తాయని అధ్యయనాలు తెలుపుతున్నాయి.
కరోనాతో కంటికి ముప్పు మాత్రమే కాదు.. కంటిలోని కణాలను తీవ్రంగా నాశనం చేస్తుందని అంటున్నారు పరిశోధకులు. కరోనావైరస్ కంటి నుంచి శరీరంలోకి సులభంగా ప్రవేశించగలదని చెబుతున్నారు. వైరస్ కంటిలోని కణాలను నాశనం చేస్తుందని గుర్తించారు. అమెరికాకు చెందిన మౌంట్ సైనాయ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈ కొత్త అధ్యయనాన్ని నిర్వహించారు. కంటిలోని స్రావాలను ఆధారంగా చేసుకుని వైరస్ శరీరంలోకి ప్రయాణిస్తుందని గుర్తించారు. కంటిలోని కణాల నాశనం చేయడమే కాకుండా ఎసిఈ2 ద్వారా వైరస్ శరీరంలోకి చేరుతుందని పరిశోధకులు కనుగొన్నారు.
కంటిలోని ముందు భాగమైన లింబస్ వైరస్కు ఎక్కువగా ప్రభావితం అవుతుందని గుర్తించారు. అయితే కంటిలోని కార్నియాకు తక్కువ ముప్పు ఉంటుందని పేర్కొన్నారు. ముఖంలోని ప్రతి భాగం వైరస్ను శరీరంలోకి పంపేందుకు వాహకంగా మారుతుందన్నారు. తరచూ చేతులు శుభ్రపరచుకోవాలని, ముఖం భాగాన్ని తాకకుండా ఉండాలని సూచించారు. ఫేస్ షీల్డ్ల వాడకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పరిశోధకులు వెల్లడించారు. విట్రో స్టెమ్ సెల్ నమూనాలను వినియోగించారు. కరోనా బారిన పడిన వారి నుంచి నమూనాలను సేకరించారు. ఆర్ఎన్ఏ సీక్వెన్సింగ్ చేయగా కంటిలోని లోపలి కణజాలంపై వైరస్ ప్రభావాన్ని గుర్తించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more