మహారాష్ట్రపై బ్లాక్ ఫంగస్ పంజా విసిరింది. గత ఏడాది కరోనా వైరస్ వెలుగు చూసిన నాటి నుంచి దాని బారినపడి కోలుకుంటున్న రోగులుతో పాటు కోలుకున్న బాధితుల్లో ఏకంగా 52 మంది ప్రాణాలను ఒక్క మహరాష్ట్రలోనే ముకోర్ మైకోసిస్ కబళించి వేసింది. ఈ మేరకు మహారాష్ట్రకు చెందిన సీనియర్ వైద్యఅరోగ్య శాఖ అధికారి వెల్లడించారు. ఇప్పటికీ ఈ బ్లాక్ పంగస్ బారిన పడిన పలువురు చికిత్స పోందుతున్నారని మహారాష్ట్ర అరోగ్యశాఖ మంత్రి రాజేష్ టోప్ తెలిపారు. ప్రస్తుతం మహారాష్ట్రలో 1500 కేసులు వున్నాయిని ఆయన తొలిసారిగా ప్రకటించారు.
వీరి చికిత్స కోసం లక్ష యాంఫోటెరిసిన్-బి యాంటీ ఫంగల్ ఇంజెక్షన్లకు టెండర్లను అహ్వానించామని చెప్పారు. కరోనా రెండో దశ ఉద్దృతంగా కొనసాగుతున్న ఈ తరుణంలో రాష్ట్రంపై బ్లాక్ పంగస్ కేసు మరో బారంగా మారింది. ముకోర్ మైకోసిస్ బారిన పడి రోగుల్లో అనేక మంది మృత్యువాత పడటం కూడా అందోళన కలిగించే అంశమని దీంతో మరణాల శాతాన్ని తగ్గించేందుకు వైద్యులు శాయశక్తులా కృషిచేస్తున్నారని రాజేశ్ టోప్ అన్నారు. మలేరియా, టైఫాండ్ తరహాలో బ్లాక్ పంగస్ అన్నది ఒక గుర్తింపుపోందిన వ్యాది కాదని అందుచేత దీనిని మ్యాపింగ్ చేయలేదని, డేటాబేస్ కూడా రూపోందించలేదని మహారాష్ట్ర అరోగ్యశాఖ అధికారి తెలిపారు.
ఇక అటు ఉత్తర్ ప్రదేశ్ లోనూ బ్లాక్ పంగస్ తన ఉద్దృతిని చాటుతోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 73 కేసులు బయటపడ్డాయి. వీటిలో అత్యధికంగా వారణాసిలో 20 కేసులు నమోదయ్యాయి. ముఖ్యమంత్రి యోగీ అధిత్యనాథ్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఆయన సొంత నియోజకవర్గం గోరఖ్ పూర్ లో 10 కేసులు బయటపడగా, లక్నోలో 15 కేసులు, ప్రయాగ్ రాజ్ లో 6, గౌతమ్ బుద్ధనగర్ లో 5, మీరట్ లో 4, కాన్పూర్, మధురలో రెండు చొప్పున, ఆగ్రాలో ఒక్క బ్లాక్ పంగన్ కేసు నిర్ధారణ అయ్యాయి. కారణంగా కాన్పూర్ లో ఇద్దరు కరోనా పేషెంట్లు మృతి చెందగా... మధురలో ఇద్దరు, లక్నోలో ఒక పేషెంట్ ఫంగస్ ఇన్ఫెక్షన్ కారణంగా కంటిచూపును కోల్పోయారు.
ప్రాణాలను హరించే ఈ ఫంగస్ విస్తరిస్తున్న నేపథ్యంలో యూపీలోని యోగి ఆధిత్యనాథ్ ప్రభుత్వం అలర్ట్ అయింది. ఫంగస్ వ్యాప్తి చెందుతున్న తొలి దశలోనే దాన్ని ఎదుర్కొనేందుకు 14 మంది వైద్య నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం యోగి ఆదేశించారు. ఈ కమిటీ ప్రస్తుత పరిస్థితిని సమీక్షించడమే కాకుండా... ప్రభుత్వానికి అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తుంది. సుదీర్ఘకాలంగా స్టెరాయిడ్స్ వాడుతున్న వారు, ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉన్నవారు బ్లాక్ ఫంగస్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. డయాబెటిస్ నియంత్రించలేని స్థాయిలో ఉన్నవారికి కూడా ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెపుతున్నారు.
ముకోర్ మైకోసిస్(బ్లాక్ ఫంగస్) లక్షణాలు ఇవే: కళ్లు, ముక్కు చుట్టూ ఎర్రబారడం, జ్వరం, తలనొప్పి, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, నొప్పులు, నెత్తుటి వాంతులు, చురుకుదనంలో మార్పులు చోటుచేసుకోవడం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more