అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న అసోంలో బీజేపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. అసోం బీజేపి ప్రతినిధిగా ముఖ్యమంత్రి సోనూవాల్ ను అధిగమించి మరీ దూసుకుపోతున్న రాష్ట్ర మంత్రి హిమంత విశ్వశర్మపై చర్యలు తీసుకున్నఎన్నికల కమీషన్ ఆయనకు మరో షాక్ కూడా ఇచ్చింది. ఆ రాష్ట్రంలో పార్టీ కీలక నేత, ప్రచార తార(స్టార్ క్యాంపెయినర్)గా ఉన్న హిమంత విశ్వశర్మపై అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకున్న ఎన్నికల కమీషన్.. ఇక ఆ వెనువెంటనే ఆయన సోదరుడికి కూడా షాక్ ఇస్తూ మరో ఎదురుదెబ్బ తగిలేలా చేసింది.
అసోంలోని ఎన్నికల ప్రచారంలో పాల్గోంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన హిమాంత విశ్వశర్మపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటూ.. ఆయనను రెండు రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంపై నిషేధం విధించింది. ఈ మేరకు ఆయనకు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఈ ఆదేశాలు శుక్రవారం రాత్రి నుంచే అమల్లోకి రానున్నాయని స్పష్టం చేసింది. దీంతో ఈ అదేశాల ఆదివారం రాత్రి వరకు కొనసాగనున్నాయి. అయితే అదివారం సాయంత్రం ఐదు గంటలకే ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ఈ నేపథ్యంలో ఆయన ప్రచారానికి ఇక తెరపడినట్టే. హిమంత ప్రచారానికి రెండు రోజుల ముందుగానే ఎన్నికల సంఘం చెక్ పెట్టింది.
బోడోలాండ్ నేత హంగ్రామా మొహిలరీకి జైలు శిక్ష తప్పదని హిమంత విశ్వ శర్మ ఇటీవల జరిగిన ఓ సభలో హెచ్చరిస్తూ వ్యాఖ్యలు చేశారు. కోక్రాజర్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆయుధాల కేసుని ఎన్ఐఏకి అప్పగించామని తెలిపారు. హంగ్రామా సహా బోడోలాండ్ ప్రాంతంలో అలజడులు సృష్టించడాన్ని సహించబోమని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మొహిలరీని జైలుకు పంపుతామని బహిరంగంగా బెదిరించారని తెలిపారు. దీన్ని పరిశీలించిన ఎన్నికల సంఘం శర్మకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆయన ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందని ఎన్నికల సంఘం రెండు రోజుల నిషేధం విధించాలని నిర్ణయించింది.
ఇక ఇలా క్రితం రోజు రాత్రి అదేశాలను జారీ చేసిన ఎన్నికల సంఘం.. తమ అదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని కూడా తెలిపింది. అదే సమయంలో వెనువెంటనే ఆయనకు మరో షాక్ ఇచ్చింది ఎన్నికల సంఘం. ఆయన సోదరుడు ఐపీఎస్ అధికారి సుషాంత విశ్వశర్మపై కూడా బదిలీ వేటు వేసింది. గోల్ పురా జిల్లా ఎస్పీగా వున్న ఆయనను రాష్ట్ర హెడ్ క్వార్టర్ కు తరలిస్తూ అదేశాలను జారీ చేసింది. ఇక ఈ స్థానంలో వీర వెంకట రాకేశ్ రెడ్డిని జిల్లా ఎస్సీగా బాధ్యతలు చేపట్టాలని అదేశాలను జారీ చేసింది. 126 స్థానాలున్న అసోంలో మార్చి 27న తొలి విడత, ఏప్రిల్ 1న రెండో విడత పోలింగ్ పూర్తయింది. ఏప్రిల్ 6న మూడో దశ పోలింగ్ జరగనుండగా.. మే 2న ఫలితాలు వెలువడతాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more