మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. మహారాష్ట్ర-ఛత్తీస్ గడ్ సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఈ ఎన్ కౌంటర్లో ఐదుగురు మావోయిస్టులు మరణించారు. సరిహద్దు ప్రాంతంలోని ఖురుకేడ తాలుక కొబ్రామెండ అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య గంట పాట భీకర ఎదురు కాల్పులు జరిగాయి. నాగ్ పూర్ నగరానికి 350 కిలోమీటర్ల దూరంలో వున్న ఈ అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తున్న యాంటీ నక్సల్ స్వాడ్ కు మావోయిస్టులకు మధ్య ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది.
ఈ ఘటనలో పలువురు మావోయిస్టులు తప్పించుకోగా ఐదుగురు మావోలు మాత్రం హతులయ్యారు. వీరిలో ఇద్దరు మహిళా మావోయిస్టులు వున్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై గడ్చిరోలి రేంజ్ డిఐజీ సందీప్ పాటిల్ మాట్లాడుతూ.. కుర్ ఖేడా పోలిస్ స్టేషన్ కు ఒక ఫోన్ కాల్ వచ్చిందని, అందులో మావోయిస్టులు ఇవాళ కోబ్రామెండ అటవీప్రాంతంలో ఓ శిక్షణా క్యాంప్ నిర్వహిస్తున్నారని సమాచారం అందిందని.. దీంతో పోలీసు విభాగానికి చెందిన స-60 జవాన్ల బృందంతో పాటు యాంటీ నక్సల్ స్వాడ్ సంయుక్తంగా కూంబింగ్ చర్యలకు దిగాయని తెలిపారు.
ఇలా కూంబింగ్ చేస్తున్న పోలీసులను గమనించిన మావోయిస్టులు వారిపై కాల్పులు జరిపాగా. వెంటనే తేరుకున్న పోలీసులు వారిపై ఎదురుకాల్పులు జరిపారని తెలిపారు. అయితే రెండు వర్గాల మధ్య సుమారుగా గంట పాటు భీకర కాల్పులు చోటుచేసుకున్నాయని, అయితే పలువురు మావోయిస్టులు ఈ క్రమంలో తప్పించుకున్నారని, కాల్పులు అగిన తరువాత ఘటనాస్థలంలో ఐదుగరు మావోయిస్టులు మరణించి వున్నారని, వారిలో ఇద్దరు మహిళలని పోలీసులు తెలిపారు. ఘటనాస్థలం నుంచి ఆయుధాలు మావో సాహిత్యం ఇత్యాదులను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more