కరోనా వైరస్ మహమ్మారి రెండో దఫా విరుచుకుపడుతున్న క్రమంలో దేశవ్యాప్తంగా మళ్లీ కేంద్ర ప్రభుత్వం పలు ఆంక్షలను అమల్లోకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగా అందరూ మాస్కులు ధరించాలని, ప్రతీ గంటకు చేతులు కడుక్కోవాలని, బయట తిరిగే వ్యక్తులు తప్పనిసరిగా చేతులను శానిటైజ్ చేసుకోవాలని సూచిస్తున్న కేంద్ర కుటుంబఆరోగ్యశాఖ.. టీకా వేయించుకున్నవారైనా సరే తప్పనిసరిగా ఈ జాగ్రత్తలను పాటించాలని సూచించింది. ఈ క్రమంలో మాస్క్ ధరించకుండా రోడ్లపై బాహాటంగా సంచరిస్తున్నవారిపై జరిమానాను విధించింది.
ఇక ఈ క్రమంలో ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా కేసులు విజృంభిస్తున్న క్రమంలో రాష్ట్రప్రజలందరికీ ప్రభుత్వం కూడా ఈ అంక్ష్లలను అమల్లోకి తీసుకువస్తూ.. మాస్కను తప్పనిసరి చేసింది. ఈ తరుణంలో కంటపడిన తుళ్లూరు ట్రాఫిక్ సీఐ మల్లికార్జునరావుకు ఎస్పీ అమ్మిరెడ్డి జరిమానా విధించారు. ప్రజలు సౌకర్యార్ధం ఫ్రంట్ లైన్ వారియర్ గా వున్న మీరు మాస్క్ ధరించికపోతే.. మీ కుటుంబానికి కూడా ప్రమాదం పోంచి వుంటుందని సూచించిన ఎస్పీ.. స్వయంగా సీఐకి మాస్కు తొడిగారు. మాస్క్ ధరించకుండా నిర్లక్ష్యంగా తిరుగుతున్న వారిపై నిన్న గుంటూరు లాడ్జి, ఎంబీటీ కూడలిలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి పాల్గొన్నారు.
అదే సమయంలో మాస్క్ ధరించకుండా అటుగా వెళ్తున్న ట్రాఫిక్ సీఐ మల్లికార్జునరావును చూసిన ఎస్పీ పిలిచి మాస్క్ ఎందుకు ధరించలేదని ప్రశ్నించారు. అర్జెంటుగా వెళ్తూ మర్చిపోయినట్టు సీఐ చెప్పారు. వైరస్ మళ్లీ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని సీఐకి సూచించారు. మాస్క్ ధరించని సీఐకి జరిమానా విధించాలని పోలీసులకు సూచించారు. అనంతరం మాస్క్ తెప్పించి సీఐకి స్వయంగా తొడిగారు. అలాగే వాహనదారులను ఆపి, మాస్క్ ధరించకుండా రోడ్లపైకి రావొద్దని హెచ్చరించారు. మాస్కులు ధరించిన వారినే అనుమతించాలంటూ సమీపంలోని దుకాణదారులకు సూచించారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని ఎస్పీ సూచించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more