తాను పోగొట్టుకున్న డబ్బును రాబట్టుకునేందుకు తీవ్రంగా అలోచిస్తున్న ఓ ఆర్మీ జవానుకు తాజాగా వివాదాస్పదమైన ఓ జాతీయ వెబ్ సిరీస్ అక్రమమార్గంలోనే నడిచేలా ప్రేరేపించింది. అంతే ఆర్మీ జవాను కాస్తా మావోయిస్టు కమాండర్ గా మారాడు. డబ్బుల కోసం ఓ బడా బాబు ఫోన్ నెంబర్ ను సంపాదించాడు. అంతే ఇక అతడ్ని డబ్బు కోసం డిమాండ్ చేశాడు. కట్ చేస్తే డబ్బు తీసుకునే క్రమంలో పోలీసులకు అడ్డంగా దొరికిపోయి కటకటాల వెనక్కి వెళ్లాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వివరాలిలా వున్నాయి..
విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం చినబంటువానివలసకు చెందిన చందనాపల్లి రాజేశ్వరరావు ఉత్తరప్రదేశ్ లో ఆర్మీ జవానుగా పనిచేస్తున్నాడు. ఇటీవల 45 రోజుల సెలవుపై గ్రామానికి వచ్చాడు. వస్తూవస్తూ ఉత్తరప్రదేశ్ లో రూ. 30 వేలకు ఓ తుపాకి కొన్నాడు. గతంలో భూదంగాలు చేద్దామని తన సొంత డబ్బును పెట్టుబడిగా పెట్టిన రాజేశ్వరావు చేతులు కాల్చకున్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 22 లక్షల రూపాయలను పొగొట్టుకున్నాడు. తాను నష్టపోయిన డబ్బులు తిరిగి సంపాదించాలన్న అలోచనతో మదనపడ్డాడు.
అదే సమయంలో కాసింత వివాదాస్పదమైన వెబ్ సిరీస్ మిర్జాపూర్ ను చూస్తుండగా.. అతనిలో వక్రమార్గంలో వెళ్తేనే తన డబ్బులు తనకు వస్తాయన్న అలోచన పుట్టింది. అంతే క్షుణ్ణంగా ప్లాన్ చేసుకుని ఏకంగా మావోయిస్టు కమాండర్ అవతారం ఎత్తాడు. ఈ క్రమంలో ఓ బడాబాబును వెతికాడు. అతని ఫోన్ నెంబరుతోపాటు అతని పూర్తి వివరాలను సేకరించాడు. ఈ నెల 6న బంగారం వ్యాపారి బాబు ఇంటికి వెళ్లి ఆయనను బెదిరించాడు. గాల్లోకి మూడురౌండ్ల కాల్పులు జరిపి వెళ్లిపోయాడు. తర్వాతి రోజు ఫోన్ చేసి తనను తాను మావోయిస్టు కమాండర్ గా చెప్పుకున్నాడు.
రూ. 5 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తానని బెదిరించాడు. భయపడిన వ్యాపారి తాను కోటిన్నర మాత్రమే ఇవ్వగలనని చెప్పాడు. దీంతో ఆ సొమ్ము తీసుకుని పలానా చోటుకి రావాలని చెప్పాడు. సరేనన్న బంగారం వ్యాపారి విషయాన్ని పోలీసులకు చేరవేశాడు. పోలీసులు ఆయనకు నకిలీ నోట్లు ఇచ్చి నిందితుడు రమ్మన్న కొండల ప్రాంతానికి పంపించారు. వారు కూడా అక్కడే రహస్యంగా మాటు వేశారు. నిందితుడు రాజేశ్వరరావు రాగానే అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి తుపాకి, బైక్ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more